Road Accident: మల్కాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు మృతి చెందారు. ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
- Author : Gopichand
Date : 16-02-2023 - 11:27 IST
Published By : Hashtagu Telugu Desk
యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు మృతి చెందారు. ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read: Soldier Killed: డీఎంకే నేత దాడిలో మృతి చెందిన సైనికుడు
పారిశ్రామికవాడలో పనిచేసే కార్మికులు డ్యూటీకి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.