HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Revanth Wants Farmers To Go Ahead With Paddy Crop

Revanth On Paddy:వరిపంట వేయండి, ఎందుకు కొనరో చూద్దామంటోన్న రేవంత్

తెలంగాణలో వరిధాన్యం అంశం రోజురోజుకి వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఈ సమస్యపై రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఈ సమస్యపై పలు కామెంట్స్ చేశారు

  • By Siddartha Kallepelly Published Date - 06:51 PM, Sun - 26 December 21
  • daily-hunt
Revanth reddy

తెలంగాణలో వరిధాన్యం అంశం రోజురోజుకి వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఈ సమస్యపై రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఈ సమస్యపై పలు కామెంట్స్ చేశారు. మూడు నెలల నుండి రైతుల పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వింత వైఖరి అవలంబిస్తున్నాయని, ఆరు గాలం రైతు కష్టపడి పండించిన పంటను కొనే పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వాలు లేవని రేవంత్ విమర్శించారు.

ప్రభుత్వాలు, పాలకులు మారినా రైతు తల రాత మారడం లేదని, సూటు బూటు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని బీజేపీని ఉద్దేశించి రేవంత్ విమర్శించారు.
రైతులకు క్షమాపణ చెప్పి రైతు చట్టాలు వెనక్కి తీసుకున్న బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అవే చట్టాలు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ తెలిపారు.

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లొంగిపోయారని, ప్రచార ఆర్భాటాలు తప్ప రైతుల గోస సీఎం కేసీఆర్ కి పట్టట్లేదని, మళ్ళీ కొత్త నల్ల చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకువస్తే సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఎటువైపు ఉంటారో చూడాలని రేవంత్ అన్నారు. కనీస మద్దతు ధర ప్రకటించిన 23 పంటలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుండి కొనాల్సిందేనని ఆయన డిమాండ్ చేసారు.

ఇతర రాష్ట్రాలలో నేరుగా కేంద్ర ప్రభుత్వమే పంట కొనుగోలు చేస్తుందని, తెలంగాణ లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొని కేంద్రానికి అమ్ముతుంని రేవంత్ తెలిపారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మోడీ,కేసీఆర్ వైఖరి వల్ల వరి వేసుకునే రైతులు ఉరేసుకుంటున్నారని ఆయన తెలిపారు.

ఇతర దేశాలలో మన బియ్యానికి మంచి డిమాండ్ ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు చేసి నేరుగా అమ్ముకోవచ్చని అయితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోస పట్టించుకోకుండా రాజకీయ క్రీడలు ఆడుతున్నారని రేవంత్ విమర్శించారు.

మద్దతు ధర ప్రకటించిన పంటలు కొనకపోతే ప్రభుత్వం పై పీడీ యాక్ట్ పెట్టి జైల్ లో వేయాలని రేవంత్ డిమాండ్ చేసారు. రైతులు వరి పంట వేయండని,ఎందుకు కొనడో తాను చూస్తానని రేవంత్ అన్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ ఈ యాసంగిలోవరి వేసాడని, కేసీఆర్ తన సొంత పొలంలో150 ఎకరాలలో వరి పండిస్తున్నాడని తనకొక న్యాయం ప్రజలకు ఒక న్యాయమా అని రేవంత్ నిలదీశారు. ప్రజలు వరి పంట వేయాలని,పంట కొనని టీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొట్టండని రేవంత్ రైతులకు పిలునిచ్చారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • paddy
  • paddy issue
  • revanth reddy
  • telangana farmers

Related News

Raghunandan Rao

Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది

Raghunandan Rao : తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

  • Cm Revanth Reddy

    Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం

  • Cm Revanth Reddy

    CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై నిజాలు బయటపెట్టిన సీఎం రేవంత్

  • KCR model is needed for agricultural development in the country: KTR

    KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్

  • Telangana Assembly approves 42 percent reservation amendment bills for BCs

    Telangana : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd