Khammam BJP Meeting : కాంగ్రెస్ 4జీ ..బీఆర్ఎస్ 2జీ ..మజ్లిస్ 3జీ పార్టీలంటూ అమిత్ షా సెటైర్లు
కాంగ్రెస్ పార్టీ.. ఆనాడు రైతులకోసం 22వేల కోట్ల బడ్జెట్ పెడితే.. ఈరోజు మోడీ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. లక్షా 28 వేల కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు
- By Sudheer Published Date - 09:10 PM, Sun - 27 August 23
కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah)..మరోసారి కేసీఆర్ (CM KCR) ఫై నిప్పులు చెరిగారు. ఖమ్మం (Khammam )లో ఆదివారం నిర్వహించిన ‘రైతు గోస- భాజపా భరోసా’ (‘Raithu Gosa BJP Bharosa’ ) భారీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ ..తెలంగాణ లో రాబోయేది బిజెపి సర్కారే అని ,త్వరలోనే బిజెపి సీఎం భద్రాచలం వెళ్లి రాములవారి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అమిత్ షా అన్నారు.
తెలంగాణ సాధన కోసం యువత ప్రాణ త్యాగాలు చేశారని, కానీ రజాకార్లతో కలిసి కేసీఆర్ కూర్చున్నారని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ రజాకార్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. కేసీఆర్ 9 ఏళ్లుగా రజాకర్లతో కలిసి పాలన కొనసాగిస్తున్నారని, ఆయనను సాగనంపాలంటే ప్రజలు బీజేపీకి మద్దతివ్వాలన్నారు. ఒవైసీ మద్దతు కోసం రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలగా, కమలం వికసిస్తుందని జోస్యం పలికారు.
‘ఖమ్మం ప్రజలారా.. నా మాట గుర్తుంచుకోండి.. ఎన్నికలు వస్తున్నాయి. కేసీఆర్ ఓడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి రానుంది. భద్రాచలానికి దక్షిణభారతపు అయోధ్యగా పేరుంది.. భద్రాచల మందిర నిర్మాణం కోసం భక్తరామదాసు పడిన పాట్లు.. నిజాం ఏలుబడిలో జైలుపాలయ్యేందుకు కూడా సిద్ధమయ్యాడు. 17వ శతాబ్దం నుంచి తెలంగాణలో ఎవరు పాలించినా.. శ్రీరామనవమి (Sriramanavami) నాడు.. ప్రభుత్వం తరపున భద్రాచలం రాముడి కల్యాణ రాముడికి వస్త్రాలు సమర్పించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. కానీ కేసీఆర్.. ప్రభుత్వంలో మాత్రం.. కారు..భద్రాచలం (Bhadrachalam) వరకు వస్తుంది. కానీ మందిరంలోకి కారు వెళ్లకుండా.. ఆగుతోంది. ఎందుకంటే మందిరంలోకి వెళ్తే మిత్రుడికి బాధ కలుగుతుందనే ఆలోచన ఆయనది. కేసీఆర్ గుర్తుపెట్టుకోండి. మీ పని అయిపోయింది.
Read Also : Mancherial : మంచిర్యాల బీఆర్ఎస్లో నిరసన.. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని మార్చాలి..
రేపు బీజేపీ ప్రభుత్వం రాగానే.. మా సీఎం ఎవరున్నా.. కమల పుష్పాన్ని భద్రాచల రాముడి పాదపద్మముల ముందు అర్పిస్తాం. కేసీఆర్ భద్రాచలం ఇక రావాల్సిన అవసరం లేదు. స్టీరింగ్ చేతుల్లోలేని కేసీఆర్ కారు.. మనకు అవసరం లేదు. వచ్చే ప్రభుత్వం.. మోడీ (PM Modi) గారి ఆశీస్సులతో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. అందులో సందేహం లేదు. బీజేపీ నేతల మీద దౌర్జన్యాలు, అక్రమ నిర్బంధాలు చేస్తే, బెదిరింపులకు గురిచేస్తే.. వాళ్లు వెనక్కు తగ్గుతారని అనుకుంటున్నారు. మా కిషన్ రెడ్డిని, మా బండి సంజయ్ను, మా ఈటల గారిని అడ్డుకుంటే.. మేం వెనక్కు తగ్గం.. కేసీఆర్ నీ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదన్నారు.
అలాగే కాంగ్రెస్ (Congress Party) అంటే వంశపారపర్యంగా పాలించే 4జీ పార్టీ అని, బీఆర్ఎస్ (BRS) పార్టీ 2జీ పార్టీ , ఒవైసీ (AIMIM) పార్టీ ఎంఐఎం 3జీ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ అయితే కేసీఆర్, కేటీఆర్ తో 2జీ పార్టీగా ఉందని సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చేది 2జీ, 3జీ, 4జీ పార్టీలు కాదని, ప్రజల పార్టీ మోడీ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఓ రేంజ్ లో డైలాగ్స్ పేల్చారు.
కాంగ్రెస్ పార్టీ.. ఆనాడు రైతులకోసం 22వేల కోట్ల బడ్జెట్ పెడితే.. ఈరోజు మోడీ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. లక్షా 28 వేల కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం 7 లక్షల కోట్ల అప్పులు, ఇతర సబ్సిడీలిస్తే.. మోడీ ప్రభుత్వం20 లక్షలకోట్ల విలువైన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కేసీఆర్.. గుర్తుపెట్టుకో.. ఏం జరిగినా.. ఒవైసీ, కేసీఆర్తో బీజేపీ పార్టీ.. పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు. బీజేపీ ఎప్పుడైనా ఒవైసీతో కలుస్తుందా..? బీఆర్ఎస్తో కలుస్తుందా..? ఈ రెండు పార్టీలతో కనీసం వేదిక కూడా పంచుకునే పరిస్థితి లేదు. అలాంటిది వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసే ఆలోచన అర్థరహితం..” అని అమిత్ షా అన్నారు.
Related News
BJP Plan B: మ్యాజికల్ ఫిగర్ రాకపోతే బీజేపీ ప్లాన్ B ?
బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బీ ఏమిటి ? ఈ ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్లాన్ ఎ విజయవంతమయ్యే అవకాశం 60 శాతం మాత్రమే ఉందని మీరు భావించే పరిస్థితిలో ప్లాన్ బి రూపొందించబడింది. కానీ మా పరిస్థితి అలా లేదు. ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.