Punjabi Singer: పంజాబీ సింగర్ మూసేవాలా దారుణ హత్య
పంజాబీ గాయకుడు , కాంగ్రెస్ నేత సిధు మూసేవాలా(27) దారుణ హత్యకు గురయ్యారు.
- By Balu J Published Date - 10:46 PM, Sun - 29 May 22
పంజాబీ గాయకుడు , కాంగ్రెస్ నేత సిధు మూసేవాలా(27) దారుణ హత్యకు గురయ్యారు. ఆయనకు ఇస్తున్న భద్రతను పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం ఉప సంహరించుకొని 24 గంటలైనా గడవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇద్దరు మిత్రులతో కలిసి థార్ జీపులో వెళ్తుండగా వాహనంపైకి కొందరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. రక్తమోడుతున్న ఆ ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సిధు మూసేవాలా చనిపోయాడని వైద్యులు తెలిపారు. అతడి స్వగ్రామం మన్సకు చెందిన ముఠా సభ్యులే ఈ హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన్స అసెంబ్లీ స్థానం నుంచి మూసేవాలా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. అతడిపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
Related News
Police Case: కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడిన ఎస్ఐ సస్పెండ్
Police Case: మామిడి తోటలో జరిగిన దొంగతనం కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడటంతో పాటు, భూ తగాదా కేసుల్లో బాధితులకు కాకుండా వారి ప్రత్యర్థులకు సహకారం అందిస్తుడంతో ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ లోని భూంపల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న వి. రవికాంత్ ని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ ఎ. వి. రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సస్పెండ్