HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Private Travels Hikes Special Exploitation In Buses During The Dasara Festival

Private Travels Hikes: దసరా పండుగ సందర్భంగా ఆ బస్సుల్లో ప్రత్యేక దోపిడీ!

  • By Kode Mohan Sai Published Date - 04:25 PM, Fri - 11 October 24
  • daily-hunt
Private Travels Hikes
Private Travels Hikes

Private Travels Hikes: దసరా పండుగ సందర్భంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుల నుంచి కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నాయి. సాధారణ ఛార్జీలకు భిన్నంగా ఒక్కసారిగా రేట్లు పెంచడం, ట్రాఫిక్ అధికంగా ఉందని, అన్ని బస్సుల్లో సీట్లు నిండిపోయాయని చెప్పి అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. రైళ్లలో బెర్తులు ఖాళీ లేకపోవడం, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు కొరతగా ఉండటంతో ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఎంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు.

సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్:

శనివారం దసరా పండుగ, ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు శుక్రవారం సొంతూర్లకు బయల్దేరుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తూ ట్రావెల్స్ సంస్థలు నష్టాన్ని అధిగమించుకోవడానికి ఛార్జీలను పెంచుతున్నాయి. రాష్ట్రంలో 1,200 వరకు ట్రావెల్స్ బస్సులు ఉండగా, ప్రముఖ ప్రైవేటు సంస్థలు ఈ ఛార్జీల పోటీలో పాల్గొంటున్నాయి.

సాధారణ రోజులకు సరిపోల్చి, ఈ రెండు రోజుల్లో ఏసీ బస్సుల్లో సగటున ఒక్కో సీటుకు రూ. 1,000, నాన్ ఏసీ బస్సుల్లో రూ. 700 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు, విజయవాడ నుండి విశాఖపట్నానికి లేదా హైదరాబాద్ నుంచి విజయవాడకు పలు ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ బస్సుల్లో ఒక్కో బెర్త్‌కు రూ. 2,000 నుంచి రూ. 2,500 వరకు చార్జీలు పెంచారు.

ఆర్టీసీ ఏసీ ఇంద్ర సర్వీసులో విజయవాడ నుండి విశాఖపట్నానికి సీటుకు రూ. 905, అమరావతి బస్సులో రూ. 1,120 కాగా, నాన్ ఏసీ సూపర్ లగ్జరీలో రూ. 704 మాత్రమే ఉంది. ప్రైవేటు ట్రావెల్స్‌తో పోలిస్తే ఈ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, అనేక బస్సుల్లో కేవలం ఒక్కట్రెండు సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా, కుటుంబంతో కలిసి ఊళ్లకు వెళ్ళేవారు ప్రైవేటు ట్రావెల్స్‌కు ఆశ్రయించడం తప్ప మరొక దారి లేదు.

విజయవాడ నుండి ఉత్తరాంధ్ర, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాల ముఖ్య పట్టణాలకు వెళ్లే సర్వీసుల్లో ఛార్జీల రేటు అధికంగా ఉంది.

తిరుగు ప్రయాణంలో దోపిడీ మరింత పెరుగుతోంది:

దసరా పండుగ సెలవులు ఆదివారంతో ముగియనుండగా, అనేక విద్యాసంస్థలు సోమవారమే తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో, తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆదివారం సాయంత్రం నుంచి బయల్దేరే సర్వీసులకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణ ఛార్జీల కంటే రెండు రెట్లు ఎక్కువగా రాబడుతున్నారు. విశాఖపట్నం-విజయవాడ మధ్య పలుచోట్ల 3,000 రూపాయలకు పైగా ఛార్జీ వసూలు చేస్తున్నారు. ట్రావెల్స్ సంస్థలు టికెట్ ఛార్జీలను ఆన్‌లైన్‌లో దర్జాగా ప్రదర్శిస్తున్నప్పటికీ, రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు అధిక ఛార్జీలతో రాకపోకలు సాగిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కూడా పరిశీలనలు జరగడం లేదు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra
  • HEAVY RUSH AT BUS STANDS
  • PRIVATE TRAVELS HIKE BUS CHARGES
  • Private Travels Hikes

Related News

    Latest News

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd