HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Prashant Kishor Says No Party For Now Announces 3000 Km Bihar Padyatra

Prashant Kishor: నో పార్టీ.. `బీహార్`పై కేసీఆర్ బాణాలు!

కొత్త రాజ‌కీయ పార్టీపై ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

  • By CS Rao Published Date - 02:01 PM, Thu - 5 May 22
  • daily-hunt
Csr Sir
Csr Sir

కొత్త రాజ‌కీయ పార్టీపై ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎలాంటి పార్టీ పెట్టడం లేదంటూ పీకే గురువారం ప్రకటించారు. ఆ దిశగా తన మార్గాన్ని నిర్మించుకుంటున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 2 నుంచి 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్రను బీహార్లో చేపడతానని పీకే ప్రకటించారు. పాదయాత్ర ద్వారా ప్ర‌జ‌ల్ని చేరుకుంటానని వెల్ల‌డించారు. బీహార్ కేంద్రంగా కొత్త పార్టీని ప్ర‌క‌టిస్తార‌ని ప‌లువురు ఊహించుకున్నారు. కానీ, ఆయ‌న త‌న‌దైన శైలిలో పాద‌యాత్ర‌కు దిగుతున్నారు. ఇటీవ‌ల కాలంగా కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు అనేకం. ఆ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ సానుకూలంగా రాక‌పోవ‌డంతో రాత్రిరాత్రి యూ ట‌ర్న్ తీసుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ పంచ‌న చేరారు. రెండు రోజుల పాటు ఆయ‌న నిర్విరామంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆ త‌రువాత కొత్త పార్టీ అంటూ లీకులు ఇచ్చారు. వాటిని నిజ‌మ‌నుకున్న మీడియా దేశ వ్యాప్తంగా ఫోక‌స్ చేసింది. ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ తెర వెనుకుండి పీకేతో కొత్త పార్టీ పెట్టిస్తున్నార‌ని అనుమానించారు.

ఆయ‌న టార్గెట్ అంతా బీహార్ రాష్ట్రం మీదే ఉంది. ఆ రాష్ట్ర సీఎం ప‌ద‌వి కోసం ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అక్క‌డి సంప్ర‌దాయ పార్టీలు ప్ర‌స్తుతం బ‌ల‌హీనంగ ఉన్నాయ‌ని పీకే అంచ‌నా. అందుకే ఆర్జేడీ, జేడీయూ కు ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టుక‌ట్టాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ చేశారు. ప్ర‌స్తుతం సీఎం నితీష్ కుమార్ అక్క‌డ సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు. ఆయన ప్ర‌భుత్వం పూర్తి కాలం ఉండే అవ‌కాశం లేద‌ని పీకే అంచ‌నా. ఒక వేళ మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌స్తే కాంగ్రెస్ రూపంలో అధికారంలోకి రావాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. కానీ, కాంగ్రెస్ తో ఆయ‌న వ్యూహం బెడిసి కొట్టొంది. కొత్త పార్టీ అంటూ మీడియా ద్వారా ఊద‌ర‌కొట్టించుకున్నారు. సీన్ క‌ట్ చేస్తే, కొత్త పార్టీ ఆలోచ‌న ప్ర‌స్తుతానికి లేదంటూ ముక్తాయించారు. ‘‘నేను జీరో నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి. స్వరాజ్యం అనే ఆలోచనతో రానున్న మూడు నాలుగేళ్లలో సాధ్యమైనంత మంది ప్రజలను కలుసుకోవాలి’’ అంటూ తన భవిష్యత్ ప్రణాళికను పీకే వెల్ల‌డించారు. గత 15 ఏళ్లలో బీహార్ కు ఒరిగిందేమీ లేద‌ని ఆర్జీడీ, జేడీయూల‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో తనకు ఎటువంటి వ్యక్తిగత ఘర్షణ లేదంటూనే, వ్యక్తిగత సంబంధాలు వేరని, కలసి పనిచేయడం, అంగీకరించడం వేర్వేరు అని ప్రకటించారు. రాబోవు రోజుల్లో బీహార్ రాజ‌కీయాన్ని మార్చేయ‌డానికి పీకే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఎంఐఎంతో క‌లిసి ఆక్క‌డ ప‌నిచేసే అవ‌కాశం లేక‌పోలేదు.

ప్ర‌స్తుతం స‌హ‌జ మిత్రులుగా ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు కొన‌సాగుతున్నాయి. ఆ రెండు పార్టీల మ‌ధ్య ఎలాంటి పొర‌పొచ్చాలు లేవు. ఏడేళ్లుగా `పీకే`తో స‌న్నిహిత సంబంధాలు కేసీఆర్ కు ఉన్నాయి. ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టారు. అందుకు కోసం ప్రత్యేక ఎజెండాను ఇటీవ‌ల వినిపించారు. బీహార్ రాష్ట్రం నుంచి. ఆయ‌న ఎజెండాను అమ‌లు చేయ‌డానికి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ వ‌దిలిన బాణంలాగా `పీకే` బీహార్ లో ప‌నిచేయ‌బోతున్నార‌ని వినికిడి. ఇప్ప‌టికే ఎంఐఎం బీహార్ అసెంబ్లీలో చోటు సంపాదించింది. రాబోవు ఎన్నిక‌ల్లో పీకే పాద‌యాత్ర ముగిసిన త‌రువాత కొత్త పార్టీ ప్ర‌క‌టించే అవ‌కాశం లేక‌పోలేదు. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి ఎంఐఎంతో జ‌త కట్టి ప‌రోక్షంగా కేసీఆర్ మ‌ద్ధ‌తుతో రంగంలోకి దిగే మాస్ట‌ర్ స్కెచ్ హైద‌రాబాద్ కేంద్రంగా త‌యారు అయింద‌ని టాక్‌. మొత్తం మీద కేసీఆర్ బాణాలు బీహార్ రాష్ట్రం వ‌ర‌కు వెళ్లాయ‌న్న‌మాట‌.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asaduddin owaisi
  • cm kcr
  • gujarat
  • prashant kishor

Related News

Bihar Election

Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

ముఖేష్ సహాని (వీఐపీ సుప్రీమో) మాట్లాడుతూ.. బీహార్‌లో మార్పు గాలి వీస్తోందని, బంపర్ ఓటింగ్ నమోదైనట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. ఈసారి మొత్తం బీహార్‌లో మార్పు వచ్చి మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

    Latest News

    • KTR & Kishan Reddy : కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ – సీఎం రేవంత్

    • Inspections : BRS నేతల ఇళ్లలో తనిఖీలు.. ఉద్రిక్తత

    • Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డు!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd