Bangalore: ఎండీ సీఈఓ హత్య కేసులో నిందితులు అరెస్ట్.. వారందరూ కూడా ఉద్యోగులే?
తాజాగా బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ఎండీ, సీఈవో ను హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ హత్యకు పాల్పడిన వ్
- By Nakshatra Published Date - 05:40 PM, Wed - 12 July 23
తాజాగా బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ఎండీ, సీఈవో ను హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ హత్యకు పాల్పడిన వ్యక్తులు మరెవరో కాదు. ఆ కంపెనీని వీడి కొత్త కంపెనీ పెట్టిన మాజీ ఉద్యోగులే ఈ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా కొత్త కంపెనీ కస్టమర్లను, ఉద్యోగులను లాక్కొంటున్నారు అన్న అక్కసుతోనే వారిని చంపినట్లు అంగీకరించారు. హంతకుల్లో ఒకడు హత్య అనంతరం ఇన్స్టాలో పోస్టులు చేయడం గమనార్హం.
బెంగళూరు నగరంలోని అమృతహళ్లి పంపా లేఅవుట్ లోని ఎయిర్ ఆన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ వినుకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రహ్మణ్య తాజాగా మంగళవారం సాయంత్రం హత్యకు గురయ్యారు. వెంటనే పోలీసులు ఈ కేసున ఛేదించారు. నిందితులను శబరీష్, వినయ్రెడ్డి, సంతోష్గా గుర్తించారు. నిందితులంతా ఎయిర్ ఆన్లో మాజీ ఉద్యోగులు కావడం గమనార్హం. మృతులు ఫణీంద్ర, వినుకుమార్ ల కంపెనీ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. ఆ కంపెనీలోనే నిందితులు గతంలో పనిచేశారు. ఆ తర్వాత వారు సదరు కంపెనీకి రాజీనామా చేసి సొంతంగా మరో సంస్థను ఏర్పాటు చేసుకొన్నారు. నిందితుల్లో శబరీష్ తన పేరును జాక్ ఫిలిక్స్గా చెప్పుకొనేవాడు.
శబరీష్ కొత్త కంపెనీలోని పలు లోపాలపై ఫణీంద్ర మాట్లాడేవాడు. దీంతో పాటు వారి కస్టమర్లను, ఉద్యోగులను లాక్కొనేందుకు యత్నించాడని ఫణీంద్రపై కక్ష పెంచుకొన్నాడు శబరీష్. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద కత్తి తీసుకొని ఫణీంద్రను అతడి కంపెనీలోనే హత్య చేశాడు. అరుపులు వినిపించడంతో వినుకుమార్ అక్కడికి చేరుకొన్నాడు. దీంతో శబరీష్ అతడిపై కూడా దాడి చేసి హతమార్చాడు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా జాక్ ఫిలిక్స్ సోషల్ మీడియాలో తనను తాను ఒక కన్నడ ర్యాపర్గా చెప్పుకొన్నాడు. అతడికి దాదాపు 16 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ జంట హత్యల తర్వాత ఇన్స్టాలో పోస్టులు చేయడంలో బిజీగా గడిపాడు. హత్యల్లో తన ప్రమేయంపై వచ్చిన టీవీ వార్త స్క్రీన్ షాట్ను కూడా పోస్టు చేశాడు. ఈ హత్యకు ముందు కూడా ఈ ప్రపంచం మొత్తం మోసగాళ్లు, కపట పొగడ్తలు చేసేవారితో నిండిపోయింది. నేను ఈ భూమిపై వారిని శిక్షిస్తాను. మంచి వారిని ఎప్పుడూ ఏమీ చేయను అని పేర్కొన్నాడు.
Tags
Related News
Cafe Blast :‘‘సంజయ్ అగర్వాల్, ఉదయ్ దాస్..’’ బెంగళూరు బ్లాస్ట్ నిందితులు పేర్లు మార్చుకొని ఏం చేశారంటే..
Rameshwaram Cafe Blast : బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. బాంబు పేలుడులో ప్రధాన సూత్రధారి సహా ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ-NIA అదుపులోకి తీసుకుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను NIA అరెస్టు చేసిందని తెలిపారు. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితులు అస�