Sudarshan Setu: నేడు సుదర్శన్ సేతును ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!
ద్వారకా, భేట్ ద్వారక దీవులను కలుపుతూ నిర్మించిన అత్యాధునిక సుదర్శన్ సేతు (Sudarshan Setu)ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
- By Gopichand Published Date - 07:50 AM, Sun - 25 February 24
Sudarshan Setu: ద్వారకా, భేట్ ద్వారక దీవులను కలుపుతూ నిర్మించిన అత్యాధునిక సుదర్శన్ సేతు (Sudarshan Setu)ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇది భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. బ్రిడ్జి ప్రారంభోత్సవంతో భక్తులు ఈ మార్గంలో సులభంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ద్వారకకు వెళ్లే యాత్రికులు ఈ భక్తి మార్గంలో ఎన్నో అద్భుతాలను చూడవచ్చు. సుదర్శన్ సేతు కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం రూ.980 కోట్లు ఖర్చు చేశారు. తీగలపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అత్యంత అందమైన కేబుల్ వంతెనగా మారింది.
ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం
– దాదాపు 980 కోట్ల రూపాయలతో ఈ వంతెనను నిర్మించారు.
– ఈ వంతెన పొడవు దాదాపు 2.32 కిలోమీటర్లు. ఇప్పుడు దేశంలోనే అతి పొడవైన కేబుల్ ఆధారిత వంతెనగా అవతరించింది.
– వంతెనకు ఇరువైపులా భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించబడిన ఫుట్పాత్లు ఉన్నాయి.
– ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫుట్పాత్ ఎగువ భాగంలో సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి ఒక మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి.
– వంతెన నిర్మాణానికి ముందు భేట్ ద్వారకకు తీర్థయాత్రలకు వెళ్లే ప్రజలు పడవలపై ఆధారపడటం తప్ప మరో మార్గం లేదు.
– ఈ ప్రాజెక్ట్ సమర్థవంతమైన ఇంజనీరింగ్ అద్భుతం.
– దేవభూమి ద్వారకలో పర్యాటక పరంగా కూడా ఈ వంతెన చాలా ముఖ్యమైనది.
We’re now on WhatsApp : Click to Join
Related News
Iran President Death: భారత్ ఇరాన్కు అండగా నిలుస్తోందని మోడీ భరోసా
ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి మరియు మత నాయకుడు మహ్మద్ అలీ అలె-హషేమ్లతో పాటు రైసీ కూడా మరణించారు.