National Army Day:సైనికుల త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని మోదీ అభివర్ణించారు
- By Hashtag U Published Date - 01:07 PM, Sat - 15 January 22
దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జాతీయ సైనిక దినోత్సవం (జనవరి 15) సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు రామ్నాథ్ కోవింద్, నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సైనిక సందేశాన్ని పంపారు.
భారత సైన్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఆర్మీ డే’ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. మన వీర జవాన్లకు, మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. భారత సైన్యం ధైర్యసాహసాలు మరియు వృత్తి నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. దేశ భద్రతకు భారత సైన్యం చేస్తున్న అమూల్యమైన సహకారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరో ట్వీట్లో ‘భారత ఆర్మీ సిబ్బంది ప్రతికూల పరిస్థితుల్లోనూ చాలా సమర్థవంతంగా సేవలందిస్తున్నారు.
Best wishes on the occasion of Army Day, especially to our courageous soldiers, respected veterans and their families. The Indian Army is known for its bravery and professionalism. Words cannot do justice to the invaluable contribution of the Indian Army towards national safety. pic.twitter.com/UwvmbVD1hq
— Narendra Modi (@narendramodi) January 15, 2022
Related News
AP Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ చట్టం బాధితుడిని అంటూ మాజీ ఐఏఎస్ సంచలన పోస్ట్
ల్యాండ్ టైట్లింగ్ అంశం దుమారం రేపుతోన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి ల్యాండ్ టైట్లింగ్ చట్టం బాధితుడిని అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ భూ హక్కు చట్టం బాధితుడినంటూ పేర్కొన్నారు.