Pics Of KCR: టీఆర్ఎస్ నేతలపై కేంద్ర బృందం ఫైర్!
ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందం రైతు వేదికలపై
- By Balu J Published Date - 12:12 PM, Tue - 19 July 22
ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందం రైతు వేదికలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, స్థానిక ఎమ్మెల్యేల ఫొటోలు, బ్యానర్స్ ఉండటాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం అందించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) నిధుల సహాయంతో నిర్మాణ పనులు జరిగాయని పేర్కొన్నారు. సోమవారం తలమడుగు, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ పనులను బృందం పరిశీలించింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 22 లక్షల రూపాయలను కేటాయించిందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోలు పెట్టడం లేదని పలువురు టీఆర్ఎస్ నాయకులు అధికారులకు తెలిపినట్లు సమాచారం.
Related News
KTR: బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ మాట నేను చెప్పడం లేదని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు చెబుతున్నారని ఆయన అన్నారు.