Petrol Diesel Prices: బాదుడు షురూ.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!
- By HashtagU Desk Published Date - 10:55 AM, Tue - 22 March 22
సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో పెట్రోలు ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో, దాదాపు నాలుగు నెలలు తర్వాత పెట్రోలు ఉత్పత్తుల ధరలను పెంచుతూ చమరుసంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోలుపై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో తెలంగాణలోని హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర 109.10 రూపాయలు, లీటరు డీజిల్ ధర 95.49 రూపాయలుకు చేరింది.
ఇక మరో తెలుగు రాష్ట్రం ఏపీలో లీటర్ పెట్రోల్పై 88 పైసలు, డీజిల్పై 83 పైసలు పెరిగాయి. దీంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 110.80 రూపాయలు, డీజిల్ ధర 96.83 రూపాయలకు చేరింది. అలాగే గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 111.21 రూపాయలు, డీజిల్ ధర 97.26 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 96.21, డీజిల్ ధర 87.47 రూపాయలుకు చేరింది. దేశ వాణిజ్య నగరం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 110.82, డీజిల్ ధర 95.00 రూపాయలకు చేరింది. కోల్కతాలో పెట్రోల్ 105.51, డీజిల్ 90.62 రూపాయలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ 102.16, డీజిల్ ధర 92.19 రూపాయలకు చేరింది. ఇక పెరిగిన ధరలు మార్చి 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
Price of petrol & diesel in Delhi at Rs 96.21 per litre & Rs 87.47 per litre respectively today
Petrol & diesel prices per litre- Rs 110.82 & Rs 95.00 in Mumbai; Rs 105.51 & Rs 90.62 in Kolkata; Rs 102.16 & Rs 92.19 in Chennai respectively
(File pic) pic.twitter.com/2qWpUpleBo
— ANI (@ANI) March 22, 2022
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది