Royal Enfield: రాపిడో బైక్ బుక్ చేస్తే.. ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది!
సిలికాన్ సిటీగా పేరున్న బెంగళూరు ఎప్పుడు ఏదో ఒక ఘటనలో చర్చనీయాంశమవుతూనే ఉంటుంది.
- By Balu J Published Date - 12:41 PM, Sat - 12 August 23
సిలికాన్ సిటీగా పేరున్న బెంగళూరు ఎప్పుడు ఏదో ఒక ఘటనలో చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. ఐటీ, రోడ్లు, వరదలు, ఆటో ఛార్జీలు ఏదో ఒక విషయమై నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఆసక్తికర మైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. నిషిత్ పటేల్ అనే వ్యక్తి ఇతర ప్రదేశానికి ప్రయాణం చేయాలనుకున్నాడు. అయితే అతను వెంటనే రాపిడో లో బైక్ ను బుక్ చేశాడు. తీరా డ్రైవర్, బుక్ ను చేసిన బైక్ ను చూసి ఆశ్చర్యపోతాడు. సాధారణంగా బైక్ బుక్ చేయగానే స్కూటీ లేదా హీరో హోండా, పల్సర్ లాంటివి పికప్ వస్తుంటాయి. కానీ ఇక్కడ ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చి పికప్ చేసుకుంది. దీంతో షాక్ అయిన సదరు కస్టమర్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.
“ఈ రోజు నేను అనుభవించిన పిచ్చి @peakbengaluru మీతో చెబితే నమ్మరు. నేను కుబెర్నెటీస్ మీట్అప్కి వెళుతున్నప్పుడు, నా రాపిడో డ్రైవర్ రాయల్ ఎన్ఫీల్డ్ పై వచ్చాడు.”అని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజన్స్ కూడా బాగానే రియాక్ట్ అయ్యారు. అతను కూడా మీటప్లో చేరాడా?” అని బిగ్గరగా నవ్వుతూ ఆట పట్టించారు. “మీరు సైడ్ బిజినెస్ నుండి అతని టర్నోవర్ గురించి అడిగారా?” అని మరికొందరు కామెంట్స్ చేయడం ఆకట్టుకుంది.
Also Read: Rajinikanth: రజినీకాంత్ మేనియాకు బాక్సాఫీస్ షేక్, 2 రోజుల్లో 150 కోట్లు రాబట్టిన ’జైలర్‘
Related News
TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం
TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదై�