Paytm: పేటీఎం వాడేవారికి గుడ్ న్యూస్ ఉందా..? సీఈవో విజయ్ శేఖర్ శర్మ మాటలకు అర్థమేంటి..?
పేటీఎం (Paytm) పేమెంట్స్ బ్యాంక్పై చర్య తీసుకున్న తర్వాత పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఎట్టకేలకు మౌనం వీడారు. పేటీఎం పునరాగమనంపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.
- By Gopichand Published Date - 07:09 PM, Tue - 5 March 24
Paytm: పేటీఎం (Paytm) పేమెంట్స్ బ్యాంక్పై చర్య తీసుకున్న తర్వాత పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఎట్టకేలకు మౌనం వీడారు. పేటీఎం పునరాగమనంపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. మంగళవారం జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఫిన్టెక్ ఈవెంట్లో పాల్గొన్న విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ.. Paytmని ఆసియాలో అగ్రగామిగా మార్చాలనుకుంటున్నట్లు చెప్పారు. జనవరి 31న Paytm పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న చర్య తర్వాత విజయ్ శేఖర్ శర్మ మొదటిసారి పబ్లిక్ ఫోరమ్లో పాల్గొన్నారు.
విజయ్ శేఖర్ శర్మ ఏం అన్నారంటే..?
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై తీసుకున్న చర్యతో తాను నిరాశ చెందడం లేదని విజయ్ శేఖర్ శర్మ టోక్యోలో అన్నారు. కంపెనీ పునరాగమనం చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ పెద్ద సమస్య నుంచి తాను చాలా నేర్చుకున్నానని పేటీఎం బాస్ తెలిపారు. Paytm వాడుకలోకి వచ్చిన తర్వాత ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు.
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. పేమెంట్స్ బ్యాంక్పై చర్య తీసుకున్నప్పటి నుండి విజయ్ శేఖర్ శర్మ ఏ పబ్లిక్ ప్రోగ్రామ్లోనూ పాల్గొనడం లేదు. పేటీఎంను ఆసియాలోనే అతిపెద్ద ఫిన్టెక్ కంపెనీగా తీర్చిదిద్దాలని అన్నారు. నా జీవితకాలంలో ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. పేమెంట్స్ బ్యాంకుకు మార్చి 15 వరకు గడువు ఉంది. దీని తర్వాత బ్యాంక్ ఎలాంటి డిపాజిట్ లేదా టాప్ అప్ చేయలేరు.
Also Read: Pakistan: పాకిస్థాన్లో వర్ష బీభత్సం.. 22 మంది పిల్లలతో సహా 35 మంది మృతి
RBI పరిమితుల గురించి మాట్లాడుకుంటే Paytm భవిష్యత్తు దిశను ఇవి నిర్ణయించాయని ఆయన చెప్పారు. ఆర్బీఐ చర్యలు వృద్ధికి సంబంధించిన రోడ్మ్యాప్ను సిద్ధం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాయి. దీంతో పరిస్థితి స్పష్టమైంది. మాకు ఇప్పుడు మరింత సమయం ఉంది. మేము మా మిషన్ ప్రారంభించామన్నారు.
Paytm పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయబడవచ్చు
ఇదిలా ఉండగా Paytm పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ త్వరలో రద్దు చేయవచ్చని హిందూ బిజినెస్ లైన్ తన నివేదికలో పేర్కొంది.
We’re now on WhatsApp : Click to Join
Related News
MDH- Everest: భారత్లో రూట్ మార్చిన మసాలా కంపెనీలు.. రంగంలోకి FSSAI..!
సింగపూర్, హాంకాంగ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వివాదాల్లో కూరుకుపోయిన ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల వేడి దేశంలోని అన్ని మసాలా కంపెనీలకు చేరింది.