Paytm With Axis Bank: యాక్సిస్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్.. ఎందుకంటే..?
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారి చెల్లింపుల సెటిల్మెంట్ కోసం ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ (Paytm With Axis Bank)తో ఒప్పందం కుదుర్చుకుంది.
- By Gopichand Published Date - 09:35 AM, Sat - 17 February 24
Paytm With Axis Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారి చెల్లింపుల సెటిల్మెంట్ కోసం ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ (Paytm With Axis Bank)తో ఒప్పందం కుదుర్చుకుంది. మర్చంట్ పార్టనర్లకు సజావుగా చెల్లింపులు జరిగేలా ఎస్క్రో ఖాతాను తెరిచి, నోడల్ ఖాతాను యాక్సిస్ బ్యాంక్కి మార్చినట్లు కంపెనీ తెలిపింది. స్టాక్ ఎక్స్ఛేంజ్లో దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్లో Paytm ఈ సమాచారాన్ని ఇచ్చింది. మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తన నోడల్ ఖాతాను యాక్సిస్ బ్యాంక్కు మార్చినట్లు కంపెనీ తెలిపింది. Paytm QR, సౌండ్బాక్స్, కార్డ్ మెషిన్ వ్యాపార భాగస్వాములందరికీ సజావుగా పని చేయడం కొనసాగుతుందని One97 కమ్యూనికేషన్స్ తెలిపింది. మార్చి 15, 2024 తర్వాత కూడా Paytm QR, సౌండ్బాక్స్. కార్డ్ మెషీన్లు పని చేస్తూనే ఉంటాయని RBI తెలిపింది.
Paytm ప్రతినిధి మాట్లాడుతూ.. రెగ్యులేటరీ మార్గదర్శకాలు, సమ్మతిని దృష్టిలో ఉంచుకుని మా వ్యాపారి భాగస్వాములకు ఇబ్బందులు లేకుండా సేవలను అందించడానికి మేము పూర్తిగా అంకితభావంతో ఉన్నాము. Paytm యాప్.. మా పరికరాలు Paytm QR, సౌండ్బాక్స్, కార్డ్ మెషిన్ పని చేస్తూనే ఉంటాయని మేము మా వినియోగదారులకు హామీ ఇవ్వాలనుకుంటున్నామని అన్నారు.
దీనికి ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. Paytm పేమెంట్స్ బ్యాంక్కు పెద్ద ఉపశమనం ఇచ్చింది. 29 ఫిబ్రవరి 2024 నుండి Paytmపై RBI విధించిన పరిమితులను 15 మార్చి 2024 వరకు పొడిగించారు. కస్టమర్లు, దుకాణదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి Paytm పేమెంట్ బ్యాంక్కు మరికొంత సమయం ఇవ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన పాత ఆర్డర్ను సవరించింది. Paytm కస్టమర్ల మదిలో తలెత్తే సందేహాలను క్లియర్ చేయడానికి, RBI Paytm పేమెంట్ బ్యాంక్కు సంబంధించి FAQలను కూడా జారీ చేసింది. Paytmకి RBI ఉపశమనం ప్రకటించడానికి ముందు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో Paytm స్టాక్ 5 శాతం ఎగువ సర్క్యూట్ ఫిల్టర్తో రూ. 341.30 వద్ద ముగిసింది.
We’re now on WhatsApp : Click to Join
Related News
MDH- Everest: భారత్లో రూట్ మార్చిన మసాలా కంపెనీలు.. రంగంలోకి FSSAI..!
సింగపూర్, హాంకాంగ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వివాదాల్లో కూరుకుపోయిన ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల వేడి దేశంలోని అన్ని మసాలా కంపెనీలకు చేరింది.