Srisailam: నేటి నుంచి శ్రీశైలం దర్శనానికి ఆన్లైన్ టికెట్లు
- By Balu J Published Date - 11:30 AM, Tue - 25 January 22
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ విధానం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి (జనవరి25) అన్ని రకాల దర్శనం టికెట్లను ఆన్ లైన్ లోనే పొందేలా ఆలయాధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతో పాటు రూ.150, రూ.300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు కూడా ఆన్ లైన్ ద్వారానే పొందాల్సి ఉం టుంది. టికెట్ బుక్ చేసుకోవడానికి, దర్శనానికి సంబంధించి అదనపు సమాచారం కోసం భక్తులు తమ అధికారిక వెబ్ సైట్ ను చూడాలని ఆలయాధికారులు సూచించారు.
Related News
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం టికెట్ల వివరాలు ఇదిగో
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం, వసతి, శ్రీవారి సేవ కోసం ఆన్లైన్ కోటా విడుదల వివరాలను ప్రకటించింది. టిటిడి అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా భక్తులు తమ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది. మే 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం […]