Drugs In Kerala : కేరళలో భారీగా పట్టుబడ్డ హెరాయిన్.. దాని విలువ ఎంతంటే..?
దేశంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. అధికారులు ఎన్ని తనిఖీలు చేసిన సరఫరా మాత్రం అగడం...
- By Prasad Published Date - 07:25 AM, Sat - 8 October 22
దేశంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. అధికారులు ఎన్ని తనిఖీలు చేసిన సరఫరా మాత్రం అగడం లేదు. డ్రగ్స్ సరఫరా చేసే కేటుగాళ్లు వివిధ రూపాల్లో వాటిని తరలిస్తున్నారు. తాజాగా కేరళలో భారీగా హెరాయిన్ పట్టుబడటం అధికారల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ ఎక్కడికి సరఫరా చేస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీశారు. కేరళలోని కొచ్చి తీరంలో రూ.1,200 కోట్లు విలువ చేసే హెరాయిన్ అధికారులు సీజ్ చేశారు. నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో ఇరాన్కు చెందిన పడవ నుంచి 200 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆరుగురు ఇరాన్ దేశస్థులను అరెస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ డ్రగ్స్ ముందుగా పాకిస్థాన్ వెళ్లాయని, అక్కడ ఇరానియన్ బోటులో ఎక్కించి భారత్ తీసుకొచ్చారని అధికారులు తెలిపారు.
Kerala | Narcotics Control Bureau (NCB) and Indian Navy apprehended a suspicious vessel carrying more than 200 kgs of narcotics. The boat with its crew has been taken to Kochi for further investigation: Indian Navy pic.twitter.com/jYQLQFdlPY
— ANI (@ANI) October 7, 2022
Related News
Elon Musk: భారత పర్యటన రద్దు చేసుకుని చైనా వెళ్లిపోయిన ఎలాన్ మస్క్
ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని చైనా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ పర్యటన పబ్లిక్ గా జరగలేదు. ఓ ప్రైవేట్ జెట్ ద్వారా ఎలాన్ మస్క్ చైనా వెళ్లినట్లు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం మస్క్ చైనా పర్యటనలో భాగంగా చైనా అధికారులతో రహస్య భేటీలు నిర్వహించారు.