Mukhtar Ansari: గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ పోస్టుమార్టం రిపోర్ట్ ఇదే..!
ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari) గుండెపోటుతో చనిపోయాడా లేక స్లో పాయిజన్తో మరణించాడా అనేది వెల్లడైంది. నిన్న రాత్రి బయటకు వచ్చిన అతని పోస్ట్ మార్టం నివేదిక ద్వారా డాన్ మరణ రహస్యం బట్టబయలైంది.
- Author : Gopichand
Date : 30-03-2024 - 9:35 IST
Published By : Hashtagu Telugu Desk
Mukhtar Ansari: ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari) గుండెపోటుతో చనిపోయాడా లేక స్లో పాయిజన్తో మరణించాడా అనేది వెల్లడైంది. నిన్న రాత్రి బయటకు వచ్చిన అతని పోస్ట్ మార్టం నివేదిక ద్వారా డాన్ మరణ రహస్యం బట్టబయలైంది. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం.. డాన్ గుండెపోటు కారణంగా గుండె ఆగిపోవడంతో మరణించాడు. డాన్ విసెరా భద్రపరచబడింది. ఇది ఫోరెన్సిక్ విచారణకు పంపబడుతుంది. ముక్తార్ అన్సారీకి స్లో పాయిజన్ ఇచ్చినట్లు అనుమానం వ్యక్తం చేసిన ముఖ్తార్ అన్సారీ కుటుంబంలో స్లో పాయిజన్తో మరణించాడా లేదా అన్నది ఈ విచారణలో పూర్తిగా తేలనుంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్టు రావడంతో అతడికి గుండె జబ్బు ఉందనే విషయం తేలిపోయింది.
ఐదుగురు వైద్యులతో కూడిన ప్యానెల్ పోస్టుమార్టం నిర్వహించింది
డాన్ ముఖ్తార్ అన్సారీకి 5 మంది వైద్యులతో కూడిన ప్యానెల్ పోస్ట్ మార్టం చేసింది. పోస్ట్మార్టం వీడియోగ్రఫీకి దాదాపు గంట సమయం పట్టింది. దీని తరువాత సుమారు 3 గంటలు ఇతర లాంఛనాలలో గడిపారు. ఎందుకంటే ముఖ్తార్ అన్సారీ కుమారుడు ఒమర్ అన్సారీ పోస్ట్మార్టం ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తారు. బందా మెడికల్ కాలేజీ వైద్యులు అవిశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులను పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒమర్ DMకి ఒక లేఖ రాశాడు. అందులో 7 డిమాండ్లు ఉన్నాయి. అయితే పోస్ట్మార్టం నిర్వహించిన వైద్యులు అతని అపోహలను తొలగించడానికి ప్రయత్నించారు. డాక్టర్ల ప్యానెల్లో ఈఎన్టీ స్పెషలిస్ట్ ముఖేష్ కుమార్, మహేష్ గుప్తా, సీనియర్ డాక్టర్ ఎస్డి త్రిపాఠి, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ వికాస్దీప్ ఉన్నారు.
Also Read: Ranbir Kapoor: ఏడాదిన్నర కూతురికి కోట్లు విలువ చేసే బహుమతి ఇచ్చిన రణ్బీర్.. అదేంటంటే?
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు
మీడియా కథనాల ప్రకారం.. సుమారు 5 గంటల పాటు సాగిన పోస్ట్మార్టం ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ముఖ్తార్ అన్సారీ మృతదేహాన్ని అతని కుమారుడు ఒమర్ అన్సారీకి అప్పగించారు. ఉమర్ తన తండ్రి మృతదేహాన్ని ఘాజీపూర్లోని తన స్వగ్రామమైన మహమ్మదాబాద్ యూసుఫ్పూర్కు తీసుకెళ్లాడు. అక్కడ అంత్యక్రియలు జరిగాయి. ముఖ్తార్ అన్సారీ గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మరణించారు. కుమారుడు ఉమర్ అన్సారీ వ్యతిరేకించడంతో మరణం జరిగిన 15 గంటల తర్వాత శుక్రవారం మధ్యాహ్నం పోస్ట్మార్టం నిర్వహించారు. అర్ధరాత్రి ఒంటిగంటకు గాజీపూర్కు చేరుకున్న మృతదేహాన్ని రాత్రి 7 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు.
We’re now on WhatsApp : Click to Join