Ranbir Kapoor: ఏడాదిన్నర కూతురికి కోట్లు విలువ చేసే బహుమతి ఇచ్చిన రణ్బీర్.. అదేంటంటే?
- By Sailaja Reddy Published Date - 09:30 AM, Sat - 30 March 24
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్బీర్ కపూర్ అలియా భట్ ల గురించి మన అందరికి తెలిసిందే. క్యూట్ కపుల్స్ లో, స్టార్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. వీరిద్దరికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఈ ఇద్దరికి స్టార్స్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. కాగా వీరిద్దరికి 2022లో రహ అనే పాప పుట్టిన విషయం తెలిసిందే. ముత్తాత రాజ్ కపూర్ పోలికలతో పుట్టిన రహ, తన క్యూట్ లుక్స్ తో అందర్నీ ఫిదా చేసేస్తుంది. గతంలో ఈ చిన్నారికి సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వారు తెలిసిందే.
ఇది ఇలా ఉంటే, తాజాగా రణ్బీర్ తన కూతురికి భారీ బహుమతిని ఇచ్చారు. ముంబై బాంద్రాలోని తమ కృష్ణ రాజ్ బంగ్లాని రణ్బీర్ తన కూతురి పేరు మీద రాసేశారు. దాని విలువ అక్షరాలా రూ.250 కోట్లు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ బంగ్లాస్ కంటే ఈ బంగ్లా ధర ఎక్కువే. ఇక ఈ బంగ్లాని రణ్బీర్ తన పేరు మీద రాయడంతో.. బాలీవుడ్ లోనే యంగెస్ట్ రిచ్ కిడ్ గా రహ నిలిచింది. ఏడాదిన్నర వయసులోనే రహ 250 కోట్లకు యజమాని అయ్యింది. కాగా రణ్బీర్ అండ్ అలియాకి ఈ బంగ్లాతో పాటు మరో నాలుగు బంగ్లాలు కూడా ఉన్నాయి.
అయితే వాటి విలువ మొత్తం 60 కోట్ల పైబడి మాత్రమే ఉంటుందని సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఆశ్చర్య వ్యక్తం చేస్తుండగా, మరి కొంతమంది అంత చిన్న పాపకు అంత పెద్ద గిఫ్ట్ నా అంటూ షాక్ అవుతున్నారు. ఇకపోతే రణ్బీర్ కపూర్ ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.. ఇందులో రణ్ బీర్ ఆలియా భట్ కలిసిన నటించారు.
Related News
Aashritha Election Campaign: వెంకటేష్ కూతురు తొలి రాజకీయ ప్రసంగం
రఘురామ్ రెడ్డి తెలంగాణ లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ తరుపున ఖమ్మం లోకసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా తన మామ కోసం కోడలు ఆశ్రిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇది ఆమెకు తొలి రాజకీయ ప్రసంగం కావడం విశేషం.