Politics: వారందరిని హిందూ మతంలోకి తీసుకురావాలి
- By hashtagu Published Date - 11:40 AM, Mon - 27 December 21
బీజేపీ పార్లమెంటు సభుయుడు తేజస్వి సూర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీ కృష్ణ మట్ నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి ఇతర మతాలను స్వీకరించిన వారందరిని తిరిగి హిందూ మతంలోకి తీసుకు రావాలని అయన కోరారు. దేశ చరిత్రలో రాజకీయ, ఆర్ధిక, సామాజిక కారణాలవల్ల హిందూ ధర్మాన్ని విడిచి ఇతర మతాలను స్వీకరించిన వారందరిని తిరిగి హిందూ మతం స్వీకరించేలా అందరూ కలిసి పనిచేయాలని అయన అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన వివాదాస్పదమైన యాంటీ కన్వర్షన్ బిల్లు పై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
— Tejasvi Surya (@Tejasvi_Surya) December 25, 2021
Related News
New Year Celebreations: కోవిడ్-19 ఎఫెక్ట్.. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని సూచన..!
కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్-19 కొత్త ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతుండడం స్థానిక పరిపాలనను ఆందోళనకు గురిచేసింది. ప్రజలు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని నిర్ణయించారు. అలాగే నూతన సంవత్సర వేడుకల (New Year Celebreations)కు దూరంగా ఉండాలని సూచించారు.