Libya Floods: లిబియాలో భారీ వర్షాలు.. 5,000 మంది మృతి
లిబియాలో భారీ వర్షాల కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తీరప్రాంత నగరమైన డెర్నా సమీపంలో కుండపోత వర్షాల కారణంగా రెండు ఆనకట్టలు తెగిపోవడంతో లిబియాలో 5,000 మందికి పైగా మరణించారు
- By Praveen Aluthuru Published Date - 08:13 PM, Wed - 13 September 23
Libya Floods: లిబియాలో భారీ వర్షాల కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తీరప్రాంత నగరమైన డెర్నా సమీపంలో కుండపోత వర్షాల కారణంగా రెండు ఆనకట్టలు తెగిపోవడంతో లిబియాలో 5,000 మందికి పైగా మరణించారు మరియు వేలాది మంది వరదల్లో కొట్టుకుపోయారు. సెప్టెంబరు 9 శనివారం రాత్రి నుండి, మధ్యధరా సముద్రం నుండి ఈ ప్రాంతానికి వచ్చిన “డేనియల్” తుఫాను ఫలితంగా తూర్పు లిబియా మరియు గ్రీన్ మౌంటైన్ ప్రాంతాలు తీవ్ర వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి. లిబియాలోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సెప్టెంబర్ 13, బుధవారం నాడు డేనియల్ తుఫాను వల్ల డెర్నాలో కనీసం 30,000 మంది ఇళ్లను కోల్పోయినట్లు నివేదించింది. ఈ ప్రాంతాన్ని మళ్ళీ పునర్నిర్మాణానికి బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని పౌర విమానయాన మంత్రి హిషామ్ అబు షెకివాట్ అన్నారు.
లిబియా వరదల్లో చిక్కుకున్న ప్రజలకు మానవతా దృక్పథంతో సహాయం అందించాలని అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ (ఐఆర్సి) పిలుపునిచ్చింది, పరిస్థితి చాలా భయంకరంగా ఉందని హెచ్చరించింది. ఈ విషాదంలో చిక్కుకున్న వారి రక్షణ అవసరాల గురించి IRC తీవ్రంగా ఆందోళన చెందుతోంది, ముఖ్యంగా వేలాది మంది మహిళలు మరియు పిల్లలు రోడ్డుమీదకొచ్చారని తెలిపారు. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్న నేపథ్యంలో సంక్రమించే వ్యాధుల ప్రమాదాల గురించి IRC హెచ్చరించింది.
Also Read: Kobbari Laddu: ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డు.. ట్రై చేయండిలా?
Related News
Kenya : తెగిన డ్యామ్..42 మంది మృతి..భారీగా జనం గల్లంతు
Kenya: గత కొన్ని రోజులుగా కెన్యాలో అతి భారీ వర్షాల (Heavy rains)కారణంగా జనం అతలాకుతలం అవుతున్నారు. దేశంలోని పలు ప్రధాన డ్యామ్లు, నదులు నిండి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ డ్యామ్ తెగిపోయింది. దీంతో ఆ నీరంతా దిగువ గ్రామాల్లోకి వెళ్లి నీటి ప్రవాహానికి దాదాపు 42 మంది మరణించినట్లు నకురు కౌంటీ గవర్నర్ సుసాన్ కిహకా తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, పెద్ద సంఖ్యలో ఇళ్ల�