MLC Kavitha: తెలంగాణపై ఎందుకీ వివక్ష!
గత కొన్నాళ్లుగా కేంద్రంపై టీఆరెస్ పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
- By Hashtag U Published Date - 04:57 PM, Thu - 7 April 22
గత కొన్నాళ్లుగా కేంద్రంపై టీఆరెస్ పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందని..ఈ విషయంలో బీజేపీపై పోరాటం చేయాలని అధినేత కేసీఆర్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ తోపాటు..టీఆరెస్ ప్రముఖులు కేంద్రంపై తమదైన శైలిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్సీ కవిత కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ధాన్యం కొనుగోలుతోపాటు వరద సాయంలోనూ తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర సర్కారు వివక్ష చూపిస్తుందని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా వరదలు సంభవించినప్పుడు మిగతా రాష్ట్రాలకు సాయం అందించిన కేంద్రం తెలంగాణపై వివక్ష చూపించిందన్నారు. 2021-22 ఏడాదికి కేంద్రం ఆయా రాష్ట్రాలకు ప్రకటించిన వరద సాయం రెండు రోజుల కింద విడుదల చేసింది కానీ ఇందులో తెలంగాణ పేరు లేదన్నారు. వరదసాయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. అందుకు సంబంధించిన వరద సాయం లిస్టును కవిత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హైదరాబాద్ లో వరదలతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు కానీ వారికి ఎలాంటి సాయం అందించలేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో వరదలు సంభవించినప్పుడు టీఆరెస్ ప్రభుత్వం ఆదుకుందని గుర్తుచేశారు. బాధితులకు కేసీఆర్ అండగా నిలిచారన్నారు.
Related News
KCR: ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే బిఆర్ఎస్ ది ప్రత్యేక స్థానం: కేసీఆర్
KCR: దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికిచేర్చిన తెలంగాణ అస్తిత్వ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (నాటి తెలంగాణ రాష్ట్ర సమితి) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి ,పదేళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప�