MLC Kavitha: దీపావళి ప్రమాద బాధితులకు కవిత సాయం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దీపావళి వేడుకల్లో బాణాసంచా కాల్చే సమయంలో కంటికి గాయాలయ్యి సరోజినీ
- By Balu J Published Date - 06:05 PM, Tue - 25 October 22
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దీపావళి వేడుకల్లో బాణాసంచా కాల్చే సమయంలో కంటికి గాయాలయ్యి సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కోసం ఆర్థిక సాయం చేశారు. ఎమ్మెల్సీగా తనకు లభించే నెల వేతనం నుంచి బాధితుల చికిత్సకు అవసరమయ్యే మొత్తాన్ని ఆస్పత్రి అధికారులకు అందించారు. తెలంగాణ జాగృతి నాయకులు ఈ సాయాన్ని ఆస్పత్రి వైద్యులకు అందించారు.
అంతేకాకుండా బాధితులకు తోడుగా ఆసుపత్రికి వచ్చే కుటుంబ సభ్యులకు మూడు రోజులపాటు భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి దీపావళి వేడుకల్లో బాణాసంచా కాల్చుతూ కంటికి గాయాలైన వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని కల్వకుంట్ల కవిత కోరారు.
Related News
Training Of Excise Constables: ఏప్రిల్ 1 నుంచి ఎక్సైజు కానిస్టేబుళ్ల ట్రైనింగ్..!
ప్రభుత్వం మొత్తం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ (Training Of Excise Constables) పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 555 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఎంపికైనవారు ఏప్రిల్ 13వ తేదీ వరకు జాయినింగ్ కావాల్సి ఉంది.