YCP : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో 15 రోజుల రిమాండ్ పొడిగింపు
- By Prasad Published Date - 10:08 PM, Fri - 1 July 22
కాకినాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ను మరో 15 రోజులు పొడిగిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియడంతో సెంట్రల్ జైలు నుంచి పోలీసులు ఎస్కార్ట్ సాయంతో తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ్ను పొడిగించి తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. ఈనెల 23 నుంచి జైలులో రిమాండ్లో ఉన్న అనంతబాబు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
Related News
Pithapuram: పవన్ ని ఓడించేందుకు కుట్ర..పిఠాపురంలో 80 లక్షల మద్యం సీసాలు..
పిఠాపురంలోని వైఎస్ఆర్ గార్డెన్ ప్రాంతంలో కుమారపురంలో రూ.80 లక్షల విలువైన మద్యం సీసాలు వెలుగు చూశాయి. దీంతో అక్కడ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒకే ఇంట్లో 2560 లీటర్లకు పైగా మద్యం నిల్వ ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.