Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ‘మసూద’ మూవీ టీం!
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశాంత్ నగర్ లో మసుధ మూవీ టీం మొక్కలు
- By Balu J Published Date - 05:41 PM, Sat - 12 November 22
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశాంత్ నగర్ లో మసుధ మూవీ టీం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటి, నటులు తిరువీర్, కావ్య, భాంధవి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. నవంబర్ 18 న మసుధ మూవీ రిలీజ్ అవుతున్న సందర్బంగా అందరం కలిసి మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొనడం ఒక పండగ వాతావరణం లా అనిపించింది అన్నారు.
మంచి ఆక్సీజన్ కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. సందర్బం ఏది అయినా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అన్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఇంకా ఎన్నో మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమం లో ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్, డైరెక్టర్ సాయి కిరణ్ పలువురు పాల్గొన్నారు.
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.