Transfer of IASs : తెలంగాణలో భారీగా IASల బదిలీ
Transfer of IASs : ఇంధన శాఖకు నవీన్ మిట్టల్, R&R కమిషనర్గా శివకుమార్ నాయుడు నియమితులయ్యారు. ఎన్ఎస్ శ్రీధర్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖల ముఖ్య కార్యదర్శి పదవి అప్పగించారు
- By Sudheer Published Date - 10:15 PM, Thu - 12 June 25

తెలంగాణ(Telangana)లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఐఏఎస్ అధికారుల (Transfer of IASs) బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టింది. రాష్ట్రంలో నిర్వహణ పారదర్శకత, పరిపాలనా సమర్థత పెంచేందుకు ఈ బదిలీలను చేపట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన శాఖల్లో అధికారుల బాధ్యతల్లో మార్పులు చేసి, తాజా పాలన చర్చనీయాంశమైంది.
కొత్త బాధ్యతలు స్వీకరించిన ఉన్నతాధికారులు
నూతన బదిలీల ప్రకారం, లోకేశ్ కుమార్కు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించగా, శశాంక్ గోయల్ ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా నియమితులయ్యారు. హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, జ్యోతి బుద్ధప్రకాశ్కు ఎస్సీ అభివృద్ధి శాఖను అప్పగించగా, భారతీ లక్పతి నాయక్ సమాచార కమిషన్ సెక్రటరీగా నియమితులయ్యారు.
Air crash incident : విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్
ఇతర కీలక నియామకాలు
ఇంధన శాఖకు నవీన్ మిట్టల్, R&R కమిషనర్గా శివకుమార్ నాయుడు నియమితులయ్యారు. ఎన్ఎస్ శ్రీధర్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖల ముఖ్య కార్యదర్శి పదవి అప్పగించారు. ఈ బదిలీలు రాష్ట్ర పరిపాలనలో నూతన ఊపును తెస్తాయని, ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.