Manipur: మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత.. కారణమిదే..?
మణిపూర్ (Manipur)లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహరించారు.
- By Gopichand Published Date - 10:34 AM, Wed - 28 February 24
Manipur: మణిపూర్ (Manipur)లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహరించారు. సెక్యూర్టీ బలగాలు తక్షణమే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అదనపు ఎస్పీ అమిత్ కుమార్ను కాపాడి సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించి ఆరోగ్యం నిలకలడగా వుందని వైద్యులు దృవీకరించారు.
తాజా ఉద్రిక్తత కారణంగా మంగళవారం (ఫిబ్రవరి 27) మణిపూర్లో సైన్యాన్ని పిలిచారు. మైతేయ్ సంస్థ అరంబై టెంగోల్ కార్యకర్తలు సీనియర్ పోలీసు అధికారిని అతని నివాసం నుండి అపహరించినట్లు ఆరోపణలు రావడంతో అస్సాం రైఫిల్స్కు చెందిన నాలుగు బృందాలు ఇంఫాల్ తూర్పులో మోహరించబడ్డాయి. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు.
పోలీసులు, భద్రతా బలగాల సత్వర చర్య తర్వాత మణిపూర్ పోలీసు ఆపరేషన్స్ బ్రాంచ్లో పోస్ట్ చేయబడిన అదనపు పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ను రక్షించినట్లు అధికారులు తెలిపారు. పోలీసు అధికారిని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతని పరిస్థితి నిలకడగా ఉంది.
Also Read: Ashish Reddy Love Me : లవ్ మీ అంటున్న ఆశిష్.. దెయ్యంతో లవ్వాట ఎలా ఉంటుందో..?
అలజడి ఎందుకు చెలరేగింది..?
ఈ సంఘటనకు సంబంధించి మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఇంఫాల్ ఈస్ట్లోని వాంగ్ఖీలో ఉన్న కుమార్ ఇంటిపై అరంబై తెంగ్గోల్ కార్యకర్తలు దాడి చేశారని అధికారులు తెలిపారు. వాహన చోరీకి పాల్పడినందుకు ఆ గ్రూప్లోని ఆరుగురు సభ్యులను సంబంధిత అధికారి అరెస్టు చేయడమే కాల్పులకు కారణమని అధికారులు తెలిపారు.
We’re now on WhatsApp : Click to Join
అతని అరెస్టు తరువాత మీరా పాబిస్ (మీతేయి మహిళా సంఘం) బృందం అతనిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన, రోడ్లను దిగ్బంధించింది. మంగళవారం సాయంత్రం జరిగిన దాడిలో ఆరంబై టెంగోల్తో సంబంధం ఉన్న సాయుధ కార్యకర్తలు ఒక ఇంటిని ధ్వంసం చేశారని, కనీసం నాలుగు వాహనాలను బుల్లెట్లతో ధ్వంసం చేశారని ఆయన చెప్పారు.
పోలీసులు అధికారిని రక్షించారు
మణిపూర్ పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి బలగాలను సమీకరించి రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతం చేశారు. ఈ ప్రయత్నంతో కుమార్ కొద్ది గంటల్లోనే సురక్షితంగా బయటపడ్డాడు. సహాయక చర్యల తరువాత, పరిస్థితి క్షీణించడంతో రాష్ట్ర ప్రభుత్వం సైన్యం సహాయం తీసుకోవలసి వచ్చింది.
అస్సాం రైఫిల్స్కు చెందిన నాలుగు బృందాలను రిక్విజిషన్ చేసి ఘటన జరిగిన ప్రాంతం చుట్టూ మోహరించినట్లు అధికారులు తెలిపారు. లోయ ప్రాంతాలలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం వర్తించదు. అస్సాం రైఫిల్స్ అనేది పారామిలిటరీ దళం. ఇది ఆర్మీ కార్యాచరణ కమాండ్ కింద పనిచేస్తుంది.
Related News
2 Soldiers Killed : మణిపూర్లో ఉగ్రపంజా.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
2 Soldiers Killed : మణిపూర్లో కుకీ వర్గానికి చెందిన ఉగ్రవాద మూకలు మరోసారి రెచ్చిపోయారు.