Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికుడి బీభత్సం.. బ్యాగ్ లో బాంబు ఉందంటూ హల్ చల్..!
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం (Delhi Airport)లో ఒక వ్యక్తి భద్రతా తనిఖీల సమయంలో బీభత్సం సృష్టించాడు. ఎయిర్పోర్ట్లో భద్రతా తనిఖీల సమయంలో ఒక వ్యక్తి తన బ్యాగ్లో బాంబు ఉందని ఎయిర్లైన్ సిబ్బందికి చెప్పాడు.
- By Gopichand Published Date - 01:01 PM, Tue - 18 April 23
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం (Delhi Airport)లో ఒక వ్యక్తి భద్రతా తనిఖీల సమయంలో బీభత్సం సృష్టించాడు. ఎయిర్పోర్ట్లో భద్రతా తనిఖీల సమయంలో ఒక వ్యక్తి తన బ్యాగ్లో బాంబు ఉందని ఎయిర్లైన్ సిబ్బందికి చెప్పాడు. ఏప్రిల్ 11న శివ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రాకు గోఫస్ట్ ఫ్లైట్ (జి8-157) ఎక్కాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. ఎయిర్లైన్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సెకండరీ పాయింట్ వద్ద తనిఖీ కోసం తన బ్యాగ్ని తెరవమని అడగగా, అతను తన బ్యాగ్లో బాంబు ఉందని చెప్పాడు.
అతను తన బ్యాగ్లో బాంబు ఉందని ఎయిర్లైన్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఏప్రిల్ 11న శివ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రాకు గోఫస్ట్ ఫ్లైట్ (జి8-157)లో వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. ఎయిర్లైన్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తనిఖీ కోసం తన బ్యాగ్ని తెరవమని అడగగా శివ రెచ్చిపోయి తన బ్యాగ్లో బాంబు ఉందని చెప్పాడు.
Also Read: Indian Climber Missing: శిఖరాన్ని అధిరోహిస్తూ భారతీయ పర్వతారోహకుడు మిస్సింగ్.. ఆచూకీ కోసం గాలింపు
విమానయాన సిబ్బంది ఏదైనా నిషేధిత వస్తువులను తీసుకువెళుతున్నారా అని ప్రయాణికుడిని మర్యాదపూర్వకంగా అడిగారు. అయితే అతను మరింత రెచ్చిపోయాడు. తన బ్యాగ్లో బాంబు ఉందని పేర్కొన్నాడు. ఎయిర్లైన్ సిబ్బంది స్టాండర్డ్ ప్రొసీజర్ని అనుసరించి శివను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. సిబ్బంది.. CISF అధికారులకు సమాచారం అందించారు. వారు ప్రయాణికుడి వద్దకు వెళ్లినప్పుడు శివ గొడవ సృష్టించడం కొనసాగించాడని, ఎయిర్లైన్ సిబ్బందిని కూడా ఉద్యోగం నుండి తొలగిస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుడిని తన చెక్-ఇన్ లగేజీతో సహా ఆఫ్లోడ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నిందితుడు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Related News
Latest Report: మానసిక సమస్యలతో చిత్తవుతున్న ఢిల్లీ యువత.. ఎందుకో తెలుసా
Latest Report: డిప్రెషన్తో బాధపడే వారు చిన్న వయస్సులోనే ఉన్నారని చాలా అధ్యయనాల్లో తేలింది. వారు పెరిగిన తర్వాత కూడా మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక వ్యాధుల లక్షణాలు మొదట్లో చిన్నవిగా ఉన్నా తర్వాత తీవ్రమవుతాయి. ప్రాథమిక విచారణలో వైద్యులు కూడా వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. దీని కారణంగా మానసిక వ్యాధులు గణనీయంగా పెరుగుతాయి. ఎయిమ్స్ ఇటీవలి నివేదిక నగరాల్లో వేగ�