Mallu Ravi: ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా.. కారణమిదే..?
కాంగ్రెస్ నేత మల్లు రవి (Mallu Ravi).. తన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు.
- By Gopichand Published Date - 07:33 PM, Fri - 23 February 24
Mallu Ravi: కాంగ్రెస్ నేత మల్లు రవి (Mallu Ravi).. తన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా మల్లు రవి ఇప్పటికే నాగర్కర్నూల్ ఎంపీ టికెట్కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ స్థానం నుంచి తాను పోటీ చేయడం ఖాయమని డాక్టర్ మల్లు రవి ఇటీవల స్పష్టం చేశారు. తాను పోటీ చేయడానికి అధికార ప్రతినిధి అడ్డు వస్తే ఆ పదవికి రాజీనామా చేస్తానని గతంలోనే ప్రకటించారు.
Also Read: India vs England: తొలి రోజు ముగిసిన నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ స్కోరు 302/7..!
ఈ ఏడాది జనవరిలో న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి నియమితులయ్యారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవి అదే పదవిలో ఉన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నిరంతరం పని చేస్తానని ఆయన గతంలో అన్నారు. తప్పకుండా ఎంపీగా గెలుపొందుతానని కూడా ధీమా వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp : Click to Join
Related News
Lok Sabha Poll : ప్రధాని మోడీ ఫై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
మన దేశ ప్రధాని మోడీ ఏక్ నిరంజన్. భార్యను కూడా ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలుతాడో ఆలోచించి ఓటు వేయాలి. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుడ్ని భద్రాద్రి రామలయంలో పెట్టుకున్నాం