HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Lack Of Seeds Fertilizers Pesticides Delays Kharif Ops

Kharif : ఖ‌రీఫ్‌లో విత్తనాలు, ఎరువుల కొర‌త‌.. తీవ్ర ఆందోళ‌నలో రైతులు

  • Author : Prasad Date : 02-07-2022 - 9:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kharif
Kharif

రాజమహేంద్రవరం: గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ తూర్పుగోదావరి జిల్లా ఇప్ప‌టికే పొలం పనులు సందడిగా సాగి, నాట్లు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా ప‌నులు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగానే వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు చెప్తున్న దానిని రైతులు కొట్టిపారేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరసమైన ధరలకు అందడం లేదని వారు వాపోతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. గతంలో ఎరువులకు ఎకరాకు రూ.800 ఖర్చు అయితే ఇప్పుడు ఎకరాకు రూ.2 వేలు ఖ‌ర్చు అవుతుంద‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పురుగుమందుల ధర రెట్టింపు అయింద‌ని.. ఇంధన ధరల పెరుగుదల, ట్రాక్టర్లు మరియు యంత్రాల ధరలు కూడా పెరిగిపోవ‌డంతో ఇన్‌పుట్ ఖర్చు పెరిగిందని రైతులు తెలిపారు.

ఖరీఫ్‌ పనులకు ముందస్తుగా నీటిని విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అందని ద్రాక్షగానే మిగిలింది. గత ఖరీఫ్, రబీ పంటలకు ప్రభుత్వం ఎంఎస్‌పీని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేకపోయింది. వరి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు డబ్బులు అందుతాయని అధికారులు చెప్పిన‌ప్ప‌టికి ఇప్ప‌టికీ ఆ డ‌బ్బులు రైతుల‌కు అంద‌లేదు. జిల్లాలోని కోరుకొండ మండలానికి చెందిన మెట్టభూమికి చెందిన తనకాల నాగేశ్వరరావు అనే రైతు తాను నవంబర్ చివరి వారంలో రైతు భరోసా కేంద్రంలో వరి ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి దాదాపు రూ.8 లక్షలు రావాల్సి ఉందని.. అయితే చాలా రోజుల‌కు త‌న ఖాతాలో రూ.6 లక్షలు జమకాగా మరో రూ.2 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని రైతు తెలిపారు. చాలామంది రైతుల ప‌రిస్థితి ఇదే విధంగా ఉండ‌టంతో ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాలో మొత్తం 18 మండలాల్లో 82,000 హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో 79 వేల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో చెరకు, పసుపు, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు పండిస్తున్నారు. ఇప్పటి వరకు 26 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు మాట్లాడుతూ జూలై నెలాఖరు నాటికి నూరుశాతం నాట్లు పూర్తవుతాయని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • kharif
  • Seeds

Related News

Chandrababu Naidu Serious

కల్తీ పాలు తాగి నలుగురు మృతి.. రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

Chandrababu Naidu  రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను తీవ్రంగా ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాజమండ్ర

  • Ntr Bharosa Pension Scheme

    ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం

  • Chandrababu Naidu

    ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Balayya Building House In Hindupur

    నా కేరాఫ్ అడ్రస్ హిందూపూర్.!

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Latest News

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

  • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

  • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

Trending News

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd