HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Lack Of Seeds Fertilizers Pesticides Delays Kharif Ops

Kharif : ఖ‌రీఫ్‌లో విత్తనాలు, ఎరువుల కొర‌త‌.. తీవ్ర ఆందోళ‌నలో రైతులు

  • Author : Prasad Date : 02-07-2022 - 9:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kharif
Kharif

రాజమహేంద్రవరం: గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ తూర్పుగోదావరి జిల్లా ఇప్ప‌టికే పొలం పనులు సందడిగా సాగి, నాట్లు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా ప‌నులు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగానే వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు చెప్తున్న దానిని రైతులు కొట్టిపారేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరసమైన ధరలకు అందడం లేదని వారు వాపోతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. గతంలో ఎరువులకు ఎకరాకు రూ.800 ఖర్చు అయితే ఇప్పుడు ఎకరాకు రూ.2 వేలు ఖ‌ర్చు అవుతుంద‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పురుగుమందుల ధర రెట్టింపు అయింద‌ని.. ఇంధన ధరల పెరుగుదల, ట్రాక్టర్లు మరియు యంత్రాల ధరలు కూడా పెరిగిపోవ‌డంతో ఇన్‌పుట్ ఖర్చు పెరిగిందని రైతులు తెలిపారు.

ఖరీఫ్‌ పనులకు ముందస్తుగా నీటిని విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అందని ద్రాక్షగానే మిగిలింది. గత ఖరీఫ్, రబీ పంటలకు ప్రభుత్వం ఎంఎస్‌పీని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేకపోయింది. వరి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు డబ్బులు అందుతాయని అధికారులు చెప్పిన‌ప్ప‌టికి ఇప్ప‌టికీ ఆ డ‌బ్బులు రైతుల‌కు అంద‌లేదు. జిల్లాలోని కోరుకొండ మండలానికి చెందిన మెట్టభూమికి చెందిన తనకాల నాగేశ్వరరావు అనే రైతు తాను నవంబర్ చివరి వారంలో రైతు భరోసా కేంద్రంలో వరి ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి దాదాపు రూ.8 లక్షలు రావాల్సి ఉందని.. అయితే చాలా రోజుల‌కు త‌న ఖాతాలో రూ.6 లక్షలు జమకాగా మరో రూ.2 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని రైతు తెలిపారు. చాలామంది రైతుల ప‌రిస్థితి ఇదే విధంగా ఉండ‌టంతో ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాలో మొత్తం 18 మండలాల్లో 82,000 హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో 79 వేల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో చెరకు, పసుపు, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు పండిస్తున్నారు. ఇప్పటి వరకు 26 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు మాట్లాడుతూ జూలై నెలాఖరు నాటికి నూరుశాతం నాట్లు పూర్తవుతాయని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • kharif
  • Seeds

Related News

58 Feet Bronze Potti Sriramulu Statue

అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!

58 Feet Bronze Potti Sriramulu Statue  తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసేందుకు ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఆవిష్కరిస్తోంది. పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల అలుపెరుగని దీక్షకు గుర్తుగా ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అని నామకరణం చేశారు. తుళ్లూరు సమీపంలోని శా

  • Telugu States IRCTC Special Trains

    తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

  • Minister Lokesh

    విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • Andhra Pradesh Funds

    ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

  • Tirumala Laddu

    తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Latest News

  • Naa Anveshana Anvesh : మంత్రి లోకే‌ష్‌కు యూట్యూబర్ అన్వేష్ రిక్వెస్ట్

  • Gas Shortage : వంట గ్యాస్ వినియోగదారులకు గొప్ప శుభవార్త

  • మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించే సులభమైన మార్గం ఇదే!

  • ఊతకర్రల సాయంతో న‌డుస్తున్న టీమిండియా ప్లేయ‌ర్‌.. వీడియో ఇదే!

  • ఆర్‌సీబీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

Trending News

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd