Gandipet Park : నేడు గండిపేట పార్కును ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
గండిపేట పార్కును నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు...
- By Prasad Published Date - 07:06 AM, Tue - 11 October 22
గండిపేట పార్కును నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు కొత్వాల్గూడలో ఎకో పార్క్కు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) హిమాయత్ సాగర్ సమీపంలోని కొత్వాల్గూడలో రూ.75 కోట్లతో ఎకో-పార్క్ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఇటు గండిపేట పార్కు అభివృద్ధికి ఇప్పటికే రూ.35.60 కోట్లు ఖర్చు చేసింది. 125 ఎకరాల విస్తీర్ణంలో ఎకో-పార్క్, ఇన్ఫినిటీ పూల్ను కలిగి ఉంటుంది. ఇది హిమాయత్ సాగర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రక్కనే ఉంది. 125 ఎకరాల్లో ప్రతిపాదిత పార్క్ల్యాండ్లో 85 ఎకరాలు హెచ్ఎండీఏకు చెందగా, మిగిలిన ఎకో పార్క్ను తెలంగాణ టూరిజం శాఖ భూమిలో అభివృద్ధి చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం, MA&UD స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కొత్వాల్గూడలోని ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించి, ఎకో-పార్క్, హెచ్ఎండీఏ అభివృద్ధి ప్రక్రియను ప్రారంభించడానికి అవసరమైన గ్రౌండ్వర్క్ను అధికారులకు తెలిపారు.
Related News
Hyderabad: పోలీసుల ముమ్మర తనిఖీలు.. భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత
Hyderabad: ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యం, ఇతర వస్తువులను సైబరాబాద్ ఎస్ వోటీ బృందాలు పట్టుకున్నాయి. రూ.10,60,000 విలువ చేసే 53 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 35 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న జీజే 25 యూ 9238 లారీని ఎస్ వోటీ శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు.