KTR Helped Mogilaiah: పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సాయం చేసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పినట్లుగానే పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు సాయం చేశారు.
- By Gopichand Published Date - 12:03 PM, Sun - 5 May 24
KTR Helped Mogilaiah: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పినట్లుగానే పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్య (KTR Helped Mogilaiah)కు సాయం చేశారు. తాజాగా పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యను కలిసిన మాజీ మంత్రి కేటీఆర్ ఆయనకు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా మొగిలయ్య కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మొగిలయ్యను కేటీఆర్ కలిసిన సమయంలో ఆయన వెంట ఎమ్మెల్యేలు వివేకానంద్, మల్లారెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. మొగిలయ్యను కలిసిన సమయంలో కేటీఆర్ ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు.
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యను కలిసి సాయం చేసిన మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్యే మల్లా రెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. https://t.co/j1V2qLnoCl pic.twitter.com/WnjrAH0dTD
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2024
ఇటీవల రెండు రోజుల క్రితం మొగిలయ్య సిమెంట్ పని చేస్తున్న ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను చూసిన కేటీఆర్ మొగిలయ్య కుటంబాన్ని తన వ్యక్తిగత సిబ్బంది కలుస్తారని, త్వరలోనే కలిసి ఆర్థిక సాయం చేస్తాను అని మాజీ మంత్రి ట్విట్టర్ వేదిక ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ట్వీట్ చేసిన రెండు రోజుల్లోనే మొగిలయ్యకు కేటీఆర్ సాయం చేయడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Divya Nagesh : ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? ఆ ఐకానిక్ రోల్ చేసింది ఈమె..
ఇలాంటి వ్యక్తులకు సాయం చేయటానికి కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. మనసున్న మారాజు మా కేటీఆర్ అని మరో యూజర్ ట్వీట్ చేశారు. అయితే మరికొందరు దీనిపై నెగిటివ్గా కూడా ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికల సమయం దగ్గరపడటంతో సానుభూతి కోసం కేటీఆర్ మొగిలయ్యకు సాయం చేశారని ట్వీట్ చేస్తున్నారు. ఇకపోతే తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అనంతరం జూన్ 4న ఫలితాలు విడుదల చేయనున్నారు.
We’re now on WhatsApp : Click to Join
Related News
Free Bus Scheme: ఉచిత బస్సు పథకాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు.