Congress in Dilemma: కేసీఆర్ పాలిట్రిక్స్ తో కాంగ్రెస్ డైలమా!
తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలతో కాంగ్రెస్ డైలమాలో పడింది.
- By Balu J Published Date - 04:03 PM, Mon - 23 May 22
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇతర ప్రతిపక్ష నేతలతో చర్చలు జరిపి, కొత్త ప్రతిపక్ష ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ డైలమాలో పడినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇంకా రాష్ట్రపతి పదవికి సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించలేదు. యూపీఏ కూడా రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వీటన్నింటి మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెసేతర ఉమ్మడి ప్రతిపక్ష కూటమికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. రాజకీయ నాయకులతో రాజకీయాలే చర్చిస్తామని ఆయన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
యూపీఏయేతర పార్టీలతో సహా భావసారూప్యత కలిగిన పార్టీలతో సోనియా గాంధీ సంప్రదింపులు ప్రారంభిస్తారని, అయితే ముందుగా యూపీఏ మిత్రపక్షాల అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ అగ్రనేతలు వెల్లడిస్తున్నారు. ఇటీవల ముగిసిన ‘చింతన్ శివిర్’లో రాష్ట్రపతి ఎన్నికలపై తీవ్రమైన చర్చ జరగలేదు. ఎందుకంటే పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాత్రమే దృష్టి పెట్టింది. ఇంకా ఎన్డిఎ అభ్యర్థిని ఓడించడానికి సొంత బలం లేదనే వాస్తవం కాంగ్రెస్కు తెలుసు. అయితే అధికార కూటమికి సాధారణ మెజారిటీ పొందడానికి ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీయేతర, యూపీయేతర ఓట్లకు ప్రాధాన్యం ఉంది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల బలాన్ని పరీక్షించే అవకాశం ఉన్న ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి వైపు చూడవచ్చునని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి సోనియా గాంధీ యూపీఏ భాగస్వాములందరినీ పిలిచే అవకాశం ఉంది. కానీ యూపీఏ ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెడుతుంది” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.
విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒక అభ్యర్థిని నిలబెడితే ఉమ్మడి ప్రతిపక్షం అభ్యర్థికి మద్దతివ్వవచ్చని కాంగ్రెస్ లో మరో వర్గం పేర్కొంటుంది. అయితే పార్లమెంట్లో ఎక్కువ ఎంపీలున్న బీజేడీ, వైఎస్సార్సీపీ సహా పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలిసి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టడం సాధ్యం కాదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. పార్లమెంటులో బీజేపీకి భారీ మెజారిటీ ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలకు కీలకమైన పెద్ద రాష్ట్రాల పరంగా, ఉత్తరప్రదేశ్లో దాని బలం తగ్గింది, మరికొన్ని కీలకమైన రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. అయితే ఆయా పార్టీల ఐక్యత అనేది ప్రశ్నార్థమే. అయితే మొత్తానికి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలతో కాంగ్రెస్ ఒక్కసారిగా డైలామాలో పడిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Related News
CM Revanth Reddy : ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళతో సఖ్యతగా ఉంటాం
నిన్నటి వరకు ఎన్నికల హడావిడిలో మునిగిపోయిన అధికార యంత్రాంగం ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు మీడియా చిట్ చాట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.