Agnipath : అగ్నిపథ్ నిరసనలకు కాంగ్రెస్ ఆజ్యం పోస్తోంది – కర్ణాటక సీఎం
- By Prasad Published Date - 07:26 AM, Mon - 20 June 22
అగ్నిపథ్ నిరసనలకు కాంగ్రెస్ కారణమంటూ కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై ఆరోపణలు చేశారు. యువకుడికి రక్షణ దళాల్లో 4 ఏళ్లపాటు సేవలందించేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలను ప్రేరేపించిందని ఆయన మండిపడ్డారు. ఈ నిరసన వెనుక కాంగ్రెస్ హస్తం ఉందనడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే చేస్తున్న ధర్నాలే నిదర్శనమని బొమ్మై అన్నారు. అగ్నిపథ్ సైనిక శిక్షణ కోసం యువతను చేర్చుకునే విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉందని.. యువత 17-21 సంవత్సరాల వయస్సులో సైనిక శిక్షణ పొందినట్లయితే, వారు సేవలో పని చేసిన తర్వాత వారికి అనేక అవకాశాలు లభిస్తాయన్నారు. వారిని పారామిలటరీ బలగాల్లోకి చేర్చవచ్చని ఆయన అన్నారు.
Tags
Related News
Lok Sabha Polls 2024: తమిళిసై మత ప్రచారం.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది.