Jyothi Vennam Wins Gold: భారత్కు మరో స్వర్ణం.. మూడో గోల్డ్ మెడల్ సాధించిన తెలుగు అమ్మాయి
2023 ఆసియా క్రీడల్లో భారత్కు 100 పతకాలు ఖాయమయ్యాయి. ఆర్చరీ ఫైనల్లో భారత్కు చెందిన జ్యోతి వెన్నం (Jyothi Vennam Wins Gold) అద్భుత ప్రదర్శన చేసి విజేతగా నిలిచింది.
- By Gopichand Published Date - 07:48 AM, Sat - 7 October 23
Jyothi Vennam Wins Gold: 2023 ఆసియా క్రీడల్లో భారత్కు 100 పతకాలు ఖాయమయ్యాయి. శనివారం భారత్కు శుభారంభం లభించింది. ఆర్చరీలో కాంస్యం తర్వాత భారత్ బంగారు పతకం సాధించింది. ఆర్చరీ ఫైనల్లో భారత్కు చెందిన జ్యోతి వెన్నం (Jyothi Vennam Wins Gold) అద్భుత ప్రదర్శన చేసి విజేతగా నిలిచింది. దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించి జ్యోతి బంగారు పతకం సాధించింది. ఇంతకు ముందు అదితి విలువిద్యలో మంచి ప్రదర్శన కనబరిచి ఇండియాకు కాంస్య పతకాన్ని అందించింది. ఈ వార్త రాసే సమయానికి భారత్ మొత్తం 97 పతకాలు సాధించగా, 100కు పైగా పతకాలు ఖాయమయ్యాయి.
కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి 149-145తో దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించింది. ఈ విజయంతో స్వర్ణం సాధించింది. జ్యోతి ఇప్పటికే అద్భుతంగా రాణించింది. కాంపౌండ్ మహిళల టీమ్ ఈవెంట్లో ఆమె మంచి ప్రదర్శన చేసి భారత్కు స్వర్ణం తెచ్చిపెట్టింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ జ్యోతి విజయం సాధించి భారత్కు స్వర్ణం అందించింది. ఈ విధంగా ఆమె మూడు బంగారు పతకాలలో వాటాదారుగా మారింది. మొత్తంగా ఈ ఆసియా క్రీడల్లో మూడు గోల్డ్ మెడల్స్ జ్యోతి ఖాతాలోకి వెళ్లాయి. జ్యోతి విజయంతో భారత్ 97 పతకాలు సాధించింది. టీమిండియా 100కు పైగా పతకాలు ఖాయమయ్యాయి.
Also Read: Gold Silver: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఇవే..!
We’re now on WhatsApp. Click to Join.
భారత్ శనివారం కాంస్య పతకంతో ప్రారంభించింది. కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్లో అదితి స్వామి కాంస్యం సాధించింది. ఇండోనేషియా క్రీడాకారిణిని అదితి ఓడించింది. అదితి వయసు కేవలం 17 సంవత్సరాలే. చాలా సందర్భాలలో అద్భుతంగా రాణించింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆమె బంగారు పతకం సాధించింది. ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది.
Related News
Gold Medal To Indian Army : ఇండియా ఆర్మీకి గోల్డ్ మెడల్.. ‘కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్’ అంటే ?
Gold Medal To Indian Army : భారత సైన్యానికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఏ పోటీలో తెలుసా ?