Mithali Raj Meets JP Nadda: నడ్డాతో క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ భేటీ!
ఇటీవల తరచుగా హైదరాబాద్ వస్తున్న బీజేపీ అగ్రనేతలు ఇక్కడి ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
- By Balu J Published Date - 03:17 PM, Sat - 27 August 22
ఇటీవల తరచుగా హైదరాబాద్ వస్తున్న బీజేపీ అగ్రనేతలు ఇక్కడి ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా టాలీవుడ్ అగ్ర కథనాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఈ నేపథ్యంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఇవాళ మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ హైదరాబాద్ లో కలిశారు.
మిథాలీ… నడ్డాకు పుష్పగుచ్ఛం అందించి అభివాదం తెలిపారు. నడ్డా కూడా మిథాలీకి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ భేటీ రాజకీయ సంబంధమైనదా? లేక, మర్యాదపూర్వకంగా జరిగినదా? అనేదానిపై స్పష్టత లేదు. మిథాలీ ఇటీవలే క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అటు, టాలీవుడ్ హీరో నితిన్ కూడా నేడు జేపీ నడ్డాను కలవనున్నారు. నోవాటెల్ హోటల్ లో వీరి భేటీ ఉంటుందని తెలుస్తోంది.
Had a great interaction with former Cricketer @M_Raj03. It was humbling to note her appreciation about the fillip that the sportspersons are getting under the leadership of Hon. PM Shri @narendramodi. She hailed the instrumental personal support & guidance provided by Hon Modi Ji pic.twitter.com/TyI58o29ZB
— Jagat Prakash Nadda (@JPNadda) August 27, 2022
Related News
IPL 2024 : లక్నో ఫై ఓపెనర్ల ఊచకోత..SRH ఘనవిజయం
ఓపెనర్లిద్దరూ పోటీపడి బౌండరీలు బాదడంతో 10 ఓవర్లలోపే విజయం వరించింది. ఈ విజయంతో సన్రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగయ్యాయి