India vs England: తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు టీమిండియా ఆలౌట్
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు టీమిండియా (India vs England) ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు.
- By Gopichand Published Date - 11:22 AM, Sat - 3 February 24
India vs England: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు టీమిండియా (India vs England) ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. 19 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 209 పరుగులు చేశాడు. భారత బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ 34 పరుగులు చేశాడు. 32 పరుగుల వద్ద రజత్ పాటిదార్ ఔటయ్యాడు. 14 పరుగులు చేసిన తర్వాత రోహిత్ శర్మ నిష్క్రమించాడు. 27 పరుగుల వద్ద అక్షర్ పటేల్ ఔటయ్యాడు.
Also Read: Yashasvi Jaiswal: యశస్వి విధ్వంసం.. డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్..!
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్లో నేడు రెండో రోజు. నిన్నటి స్కోరుకు 60 పరుగులు జోడించిన భారత జట్టు 396 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 209 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టు క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడైన భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ చెరో మూడు వికెట్లు తీశారు.
We’re now on WhatsApp : Click to Join
Related News
India squad: టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ప్రకటనకు మూహర్తం ఫిక్స్..!
పలువురు మాజీ క్రికెటర్లు కూడా తమ ఎంపిక మేరకు 15 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును ఎంపిక చేశారు. అయితే మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ 29 లేదా మే 1న బీసీసీఐ టీమ్ ఇండియాను ప్రకటించవచ్చు.