Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం పట్టివేత
- By Balu J Published Date - 06:21 PM, Thu - 7 September 23
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 56.63 లక్షల విలువైన 933 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడిని విమానాశ్రయ సిబ్బందిని గురువారం అరెస్టు చేశారు. సీనియర్ కస్టమ్స్ అధికారి ప్రకారం.. నిందితుడు దుబాయ్ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు. అతని లగేజీలో బంగారం లభ్యమైంది.
కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110లోని నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్న బంగారాన్ని జప్తు చేసి, కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 104 కింద ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాశ్రయ సిబ్బందిని కూడా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
Related News
Amit Shah ‘Deepfake’ Video Case: ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్
కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ సతీష్తోపాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.