Crime News: యూకే లో హైదరాబాద్ వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్కు చెందిన 65 ఏళ్ల వ్యక్తిని యూకేలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
- By Balu J Published Date - 01:12 PM, Tue - 3 October 23

Crime News: హైదరాబాద్కు చెందిన 65 ఏళ్ల వ్యక్తిని యూకేలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. (సెప్టెంబర్ 30) వెస్ట్ యార్క్షైర్లోని లీడ్స్లోని హిల్ టాప్ అవెన్యూలో మహమ్మద్ ఖాజా రయీసుద్దీన్ కత్తితో పొడిచి చంపబడ్డాడు. రయీసుద్దీన్, ఆయన స్నేహితుడైన ఆఫ్ఘన్ జాతీయుడు బయట ఉండడగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన రాయీసుద్దీన్ను పోలీసులు గుర్తించి, హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను మరణించాడు.
అతని స్నేహితుడు కూడా చనిపోయాడు. జంట హత్యలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రయీసుద్దీన్ 2011 నుండి లండన్లో నివసిస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు. అక్టోబరు 5న జరగాల్సిన తన కుమార్తె వివాహం కోసం భారత్కు రావడానికి సిద్ధమవుతుండగా హత్యకు గురయ్యాడు. కుటుంబం హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో నివసిస్తోంది. తగిన సాయం చేయాలని లండన్లోని భారత హైకమిషనర్ను ఆదేశించాలని ఖాన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్కు విజ్ఞప్తి చేశారు.