Hyderabad: ఆదిబట్ల సమీపంలో కారులో వ్యక్తి సజీవ దహనం
హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు . ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదిబట్ల సమీపంలోని ఓఆర్ఆర్పై కారులో మంటలు చెలరేగాయి
- By Praveen Aluthuru Published Date - 03:19 PM, Sun - 26 November 23
Hyderabad: హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు . ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదిబట్ల సమీపంలోని ఓఆర్ఆర్పై కారులో మంటలు చెలరేగాయి . ఈ మంటల ప్రభావంతో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అలాగే కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు కోదాడకు చెందిన వెంకటేష్గా గుర్తించారు . ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.కారులో ఎలా మంటలు చెలరేగాయి అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కారుకు ఎవరైనా నిప్పు పెట్టారా ? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Bigg Boss Tamil : బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫై దాడి ..
Related News
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.