High Court: కరోనా దృష్ట్యా పిల్లలకు వైద్య సదుపాయాలు పెంచాలి
- By hashtagu Published Date - 02:12 PM, Fri - 7 January 22
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించిన హైకోర్టు.. కేంద్రం మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. జనం గుమిగూడకుండా నియంత్రించాలని.. మాల్స్, థియేటర్లలో కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. కరోనాపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
Related News
Children: పిల్లలు అధిక బరువుతో బాధపడుతున్నారా.. అయితే వెంటనే ఈ టిప్స్ ఫాలోకండి
Children: ఆహారం, పానీయాలు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. పిల్లలు బర్గర్లు, పిజ్జా వంటి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల పిల్లల బరువు పెరగడంతోపాటు గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో పిల్లలు ఆడకుండా టీవీ, మొబైల్లో ఎక్కువ సమయం గడుపుతు