TS Schools: మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 నుండి పాఠశాలలను ఒంటిపూట నడపాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ శనివారం నిర్ణయించినట్లు సమాచారం.
- Author : Hashtag U
Date : 13-03-2022 - 11:08 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 నుండి పాఠశాలలను ఒంటిపూట నడపాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ శనివారం నిర్ణయించినట్లు సమాచారం. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మార్చి 15 నుండి మే మూడవ వారంలో వచ్చే చివరి పనిదినం వరకు ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తాయి.
ప్రస్తుతం మే 20గా నిర్ణయించిన మార్చి 15 నుంచి పాఠశాలల చివరి పనిదినం వరకు సగం రోజుల పనివేళలతో వేసవి పాఠశాలలను నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. మే మూడవ వారంలో SSC పరీక్షలు ముగియనున్నందున, మే 20 నుండి జూన్ 2022 రెండవ వారంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే వరకు వేసవి సెలవులను ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తుంది.