AP : పవన్ కల్యాణ్ వెంట్రుక కూడా పీకలేపోయాడంటూ మంత్రి అమర్నాథ్ కౌంటర్
విస్సన్నపేట సందర్శన కొండను తవ్వి ఎలుకను పట్టలేదు కాదు కదా.. వెంట్రుక కూడా పీకలేకపోయారన్నారు
- By Sudheer Published Date - 09:51 AM, Tue - 15 August 23
బోయపాటి మూవీస్ లలో ఎక్కువగా ‘వెంట్రుక కూడా పీకలేరు’ అనే డైలాగ్ తప్పనిసరిగా ఉంటుంది. అది హీరో నుంచైనా, విలన్ నుండైనా ఈ డైలాగ్ వినిపిస్తుంది. ఈ డైలాగే ఇప్పుడు వైసీపీ నేతలు తరుచు వాడుతున్నారు. మంత్రి రోజా , కొడాలి నాని , పేర్ని నాని ఎక్కువగా వాడుతుంటారు..అది కూడా పవన్ కళ్యాణ్ ఫైనే. ఇక ఇప్పుడు ఇదే డైలాగ్ ను మంత్రి అమర్నాథ్ (Gudivada Amarnath) వాడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై కౌంటర్ ఇస్తూ..పవన్ కల్యాణ్ విస్సన్నపేట (Vissannapeta ) సందర్శన కొండను తవ్వి ఎలుకను పట్టలేదు కాదు కదా.. వెంట్రుక కూడా పీకలేకపోయారు అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి మూడో యాత్ర (Varahi Yatra)కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం విస్సన్న పేట లో పర్యటించారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం ఫై మండిపడ్డారు. విస్సన్నపేటలో వాల్టా చట్టానికి విరుద్దంగా పనులు చేస్తున్నారని , ఉత్తరాంధ్రలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని , యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం ఉత్తరాంధ్ర యువత ఎక్కడెక్కడికో వలసలు పోతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కానీ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్దంగా రియల్ ఏస్టేట్ వ్యాపారం సాగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ దోపీడికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడ వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు.
పవన్ ఆరోపణలపై మంత్రి గుడివాడ అమర్నాధ్ స్పందించారు. పవన్ కల్యాణ్ విస్సన్నపేట సందర్శన కొండను తవ్వి ఎలుకను పట్టలేదు కాదు కదా.. వెంట్రుక కూడా పీకలేకపోయారన్నారు. రుషికొండ పేలిపోయి జగన్మోహన్ రెడ్డి అందులో కూరుకుపోవాలనే పవన్ వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవి అని అమర్నాధ్ అన్నారు. రుషికొండలో ఎటువంటి ఉల్లంఘణలు కనిపించక వెనక్కి తిరిగొచ్చారన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ వంటి రియల్ లైఫ్ హీరోను చూసి.. ఈర్ష్య ఎందుకో పవన్ కళ్యాణ్ చెప్పాలి..? అని ప్రశ్నించారు.
యువకులను సినిమా అనే ట్రాన్స్ లోకి తీసుకెళ్లి విచ్చలవిడిగా పవన్ వాడుకుంటున్నాడని, ఓ కీచక గురువుగా పవన్ మారడంటూ అమర్నాధ్ ఫైర్ అయ్యారు. నాపై, మా ప్రభుత్వం మీద దోపిడీ దారులు అనే ముద్ర వేసేందుకు పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అంటూ తిప్పికొట్టారు. తరతరాలుగా రాజకీయాల్లో ఎదిగిన వాళ్లం.. మేం ప్రజలకు, ప్రభుత్వానికి కస్టడీయన్ గా వ్యవహరిస్తోందన్నారు.
Read Also : 77th Independence Day: స్వాతంత్య్ర యోధుల త్యాగాలను దేశం మరువదు.. ఎర్రకోటలో ప్రధాని మోడీ ప్రసంగం
Related News
AP : ఏపిలో ఈ- ఆఫీస్ అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని వాయిదా వేసిన ఈసీ
E-Office: ఏపిలో ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఆదేశించింది. ఏపిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ స్టాఫ్ట్ వేర్ను అప్గ్రేడ్ చేఏందుకు ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) ఈనెల18 నుండి 25 వరకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. అయితే గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ-ఆఫీస్ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో �