HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Pm Modi Addressing Nation On 77th Independence Day From Red Fort In Delhi

77th Independence Day: స్వాతంత్య్ర యోధుల త్యాగాలను దేశం మరువదు.. ఎర్రకోటలో ప్రధాని మోడీ ప్రసంగం

యావత్ దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని, అక్కడ శాంతి పరిఢవిల్లేలా చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. 7వ భారత స్వాతంత్య్ర దినోత్సవాల (77th Independence Day) సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.

  • By Pasha Published Date - 08:24 AM, Tue - 15 August 23
  • daily-hunt
77th Independence Day
Whatsapp Image 2023 08 15 At 8.10.46 Am

77th Independence Day: యావత్ దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని, అక్కడ శాంతి పరిఢవిల్లేలా చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. గత కొన్ని రోజులుగా మణిపూర్ లో శాంతి వాతావరణం ఉందని, రానున్న రోజుల్లోనూ అది కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో జరిగిన హింసాకాండలో ఎంతోమంది చనిపోవడం బాధాకరమన్నారు.

77వ భారత స్వాతంత్య్ర దినోత్సవాల (77th Independence Day) సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన, అమరులైన దేశభక్తుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదన్నారు.

జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమం చారిత్రకమైనదని ఆయన చెప్పారు. ఈ ఏడాది శ్రీ అరవిందో 150వ జయంతి, స్వామి దయానంద్ సరస్వతి 150వ జయంతి, రాణి దుర్గావతి 500వ జయంతి, మీరా భాయ్ 525వ జయంతికి వేదికగా మారనుందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత దేశాన్ని సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్న అమృత్ భారత్ కాలంలో ఉండటం మనందరి అదృష్టమన్నారు. ఇప్పుడు దేశం వేస్తున్న ఒక్కో అడుగు వచ్చే 1000 ఏళ్లలో సాకారం కానున్న బంగారు భారతదేశానికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు.

Also Read: 77th Independence Day: పంద్రాగస్టుకు ముస్తాబైన భారత్.. ఎర్రకోటలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని

వచ్చే వెయ్యి ఏళ్ల కోసం దేశపు అడుగులు

“ఒక చిన్న ఘటన అయినా వేలాది సంవత్సరాల పాటు దేశముపై ప్రభావాన్ని చూపించగలదు. వేల ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటన వల్ల.. ఒక రాజు ఓడిపోవడం వల్ల మనదేశం ఆనాడు ఇతరుల కబంధ హస్తాల్లోకి వెళ్ళింది. మళ్ళీ మనం ఎంతో పోరాటం చేసి స్వాతంత్ర్యాన్ని సాధించుకోవాల్సి వచ్చింది. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఇప్పుడు మనం వేస్తున్న ప్రతి అడుగు, తీసుకుంటున్న ప్రతి నిర్ణయం, చేస్తున్న ప్రతి ఆవిష్కరణ వచ్చే వెయ్యి ఏళ్లలో మన దేశం, మన భావి తరాల తలరాతను మారుస్తుంది” అని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశ ప్రజలు ఇచ్చిన నమ్మకంతోనే కొత్త సంస్కరణలు

“దేశం అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమైంది. దేశం అభివృద్ధికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. ఈ అంశాన్ని చాటిచెప్పేందుకే ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవాలకు ప్రత్యేక అతిథులుగా చిరువ్యాపారులు, చేనేత కార్మికులు, రైతులు, కూలీలు, కార్మికులు సహా మరెన్నో వృత్తులు చేసే ప్రజానీకాన్ని పిలిచాం” అని మోడీ చెప్పారు. ఇప్పుడు ప్రపంచంలో “గ్లోబల్ సౌత్” కు దిక్సూచిగా భారత్ ఎదుగుతోందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో, ఆ తర్వాత ఇతర దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోగా.. భారత్ మాత్రం దృఢంగా నిలబడిందని చెప్పారు. “దేశ ప్రజలు 2019 ఎన్నికల్లోనూ నన్ను గెలిపించి రెండోసారి భారత ప్రధానిగా చేశారు. తద్వారా దేశంలో మరిన్ని సంస్కరణలు చేసేందుకు నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే నేను, నా ప్రభుత్వం సరికొత్త సంస్కరణలను తీసుకురాగలిగాం” అని ప్రధాని తెలిపారు.

గతంలో అవినీతి రాక్షసులు దేశ ఖజానాను దోచుకున్నారు

“ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఇంతకుముందు దేశాన్ని పాలించిన అవినీతి రాక్షసులు ఖజానాను దోచుకున్నారు. లక్షల కోట్ల కుంభకోణాలు చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం, దేశ ప్రజల జీవితాల్ని మార్చేందుకు మేం ప్రతి పైసా ఖర్చు చేస్తున్నాం. పేద ప్రజల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేస్తే దేశ ఖజానా నిండదు కానీ దేశ సామర్ధ్యం, దేశ ప్రజల సామర్ధ్యం పెరుగుతుంది. మేం దేశ ఖజానాలోని ప్రతి పైసాను నిజాయితీతో ఖర్చు చేస్తున్నాం.

గతంలో రాష్ట్రాలకు కేంద్ర సర్కారు ఏటా రూ.30 లక్షల కోట్లే ఇచ్చేది.. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రాలకు కేంద్రం రూ.100 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తోంది. గతంలో దేశంలోని స్థానిక సంస్థలకు ఏటా రూ.70వేల కోట్లు కేంద్రం కేటాయించేది.. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా రూ.3 లక్షల కోట్లు స్థానిక సంస్థలకు ఇస్తున్నాం. పేదల ఇళ్ల నిర్మాణం కోసం గతంలో కేంద్రం ఏటా రూ.90వేల కోట్లు ఇచ్చేది.. మేం ఇప్పుడు ఏటా రూ. 4 లక్షల కోట్లు ఇస్తున్నాం. పేద రైతులకు యూరియా సబ్సిడీ కోసం ఏటా రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం” అని ప్రధాని మోడీ వివరించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 77th Independence Day
  • independence day
  • Independence Day 2023
  • pm modi

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

  • Small chip made in India has the power to change the world: PM Modi

    PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ

  • Trump

    Trump: భార‌త్‌పై మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ట్రంప్‌!

Latest News

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd