HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Groundwater Running Low Crops Drying Up Farmers In A Telangana Of Disorientation

Farmers: అడుగంటిన భూగర్భజలాలు.. ఎండుతున్న పంటలు, దిక్కుతోచని స్థితిలో రైతులు

  • By Balu J Published Date - 06:14 PM, Tue - 12 March 24
  • daily-hunt
Farmers
Farmers

Farmers: తెలంగాణ రాష్ట్రమంతా భూగర్భ జలాలు ఎండిపోయాయి. దీంతో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో కమలాపూర్, భీమదేవరపల్లి మండలాల్లో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ, ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందుతుందని ఆశించిన 12 గ్రామాల రైతుల వరి పంటలు పూర్తిగా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సుమారు 10 వేల ఎకరాల్లో వరి ఎండిపోతోంది. ఇటీవలే అధికారులను కలిసిన రైతులు ఎస్సారెస్సీ డీబీఎం 22ఏ, 22బీ ద్వారా సాగునీరు విడుదల చేయాలని కోరినా ఫలితం లేదు.

కొందరు బావుల్లో పూడిక తీయించే పనుల్లో నిమగ్నం కాగా, మరికొందరు బోర్లు వేయించేందుకు అప్పులు చేస్తున్నారు. యాసంగి ఆరంభంలో తెగుళ్లు పంటలపై దాడి చేయగా ఇప్పుడు పొట్ట దశలో ఉన్న పంటలకు నీరందక ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.దాదాపు ఐదేళ్లుగా బోర్లకు గిరాకీ తగ్గింది. మంచి వర్షాలు కురవడంతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతలతో చెరువలను ముందే నింపడంతో సాగునీటితోపాటు భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి.

దీంతో బోర్లు, బావులు తవ్వకాలు ఆగిపోయాయి. బోరు యంత్రాలు పట్టణాల్లో ఇళ్లకు బోర్లు వేసే పనులు మాత్రమే చేశాయి. అయితే ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేశాయి. ఆగస్టు తర్వాత వానలు కురవలేదు. దీంతో చెరువులు, కుంటలు, జలాశయాల్లో నీరు ఇంకిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు మళ్లీ బోరు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crops
  • farmers
  • water crisis

Related News

Fertilizer Farmers

GST 2.0 : రైతులకు కేంద్రం శుభవార్త

GST 2.0 : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd