Groom Death: శోభనం గదిలో వరుడు మృతి!
పెళ్లి ప్రతిఒక్కరి జీవితంలో మరిచిపోలేని మధుర వేడుక. కానీ ఈ వ్యక్తి జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
- By Balu J Published Date - 12:26 PM, Wed - 14 September 22
పెళ్లి ప్రతిఒక్కరి జీవితంలో మరిచిపోలేని మధుర వేడుక. కానీ ఈ వ్యక్తి జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లై 12 గంటలు దాటకుండానే చనిపోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తులసీ ప్రసాద్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. సోమవారం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది.
అయితే మంగళవారం రాత్రి శోభనం ఏర్పాటుచేశాడు. శోభనం గదిలోకి వెళ్లిన వ్యక్తి విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. అతను అనారోగ్యంతో చనిపోయాడా? ఏదైనా విష ప్రయోగం జరిగిందా? అనే కోణంలో బంధువులు అనుమానిస్తున్నారు. అయితే మరణంపై అనేక అనుమానాలున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాకపోవడం కూడా గమనించదగ్గ విషయం.
Related News
Chandrababu Nomination: చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్
త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఇది మండల వ్యాప్తంగా ఉత్సాహపూరిత ఎన్నికల ప్రచారానికి నాంది పలికింది.