Madhya Pradesh: కలెక్టర్ కార్యాలయంలో మహిళలు బట్టలు విప్పి నిరసన
గుణాలో పోలీసులు ఒక వరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతను మరణించాడు. వరుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు. అనంతరం వధువు ఆత్మహత్యకు యత్నించింది.
- Author : Praveen Aluthuru
Date : 16-07-2024 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని గుణాలో అధికారుల ముందు మహిళలు హఠాత్తుగా బట్టలు విప్పిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాదు తమకు న్యాయం చేయాలంటూ మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వాస్తవానికి, గుణాలో పోలీసులు ఒక వరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతను మరణించాడు. వరుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు. అనంతరం వధువు ఆత్మహత్యకు యత్నించింది. యువకుడు మృతి చెందడంతో మహిళలు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. పలువురు మహిళలు కలెక్టరేట్కు చేరుకుని కలెక్టర్ డాక్టర్ సతేంద్రసింగ్ను కలిశారు. కలెక్టర్ అందరి మాటలు విని విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు బయటకు వచ్చి మళ్లీ గొడవ ప్రారంభించారు. అంతే కాదు మహిళలు తమ బట్టలు విప్పే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడగా, ఓ పోలీసు కూడా గాయపడ్డాడు. అంతకంతకూ పెరిగిపోతున్న గొడవను చూసిన కలెక్టర్ మళ్లీ మహిళలను పిలిపించి వాళ్లతో మాట్లాడారు. దేవ పార్ది అనే యువకుడికి కేవలం 25 ఏళ్లు మాత్రమేనని, గుండెపోటుతో చనిపోలేదని, అయితే పోలీసులు అతడిని, అతని మామను కొట్టారని మహిళలు కలెక్టర్ కు వివరించారు.
పెళ్లి రోజున దొంగతనం కేసులో వరుడిని మరియు అతని మామను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పెళ్లికూతురు, ఆమె అత్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది.
Also Read: Hyderabad Police: పాతబస్తీలో పోలీసుల అత్యుత్సాహం