Ayodhya: అయోధ్య భక్తులకు గుడ్ న్యూస్, సేవా టికెట్స్ బుక్ చేసుకోండిలా!
- By Balu J Published Date - 04:46 PM, Mon - 22 January 24
Ayodhya: భక్తులు మంగళవారం నుంచి అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. రోజువారీ పూజాదికాలు యధావిధిగా మొదలవుతాయి. సుప్రభాత సేవతో స్వామివారిని అర్చకులు మేల్కొలుపుతారు. ఆర్జిత సేవలను నిర్వహిస్తారు. అనంతరం సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు. ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో దర్శనాలు మొదలవుతాయి. 11:30 గంటలకు ముగుస్తాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయోధ్యా రాముడిని దర్శించుకోవచ్చు.
తెల్లవారు జామున 6: 30 గంటలకు జాగరణ్ హారతిని స్వామవారికి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి ఉంటుంది. సాయంత్రం 7: 30 గంటలకు సంధ్యా హారతితో తలుపులను మూసివేస్తారు. స్వామివారి సేవా టికెట్లను బుక్ చేసుకోవడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్ సైట్ https://online.srjbtkshetra.org/#/loginను సందర్శించాల్సి ఉంటుంది. మొదట తమ మొబైల్ ఫోన్ నంబర్ను రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం ఆ నంబర్కు వచ్చే ఓటీపీ పొందుపర్చడంతో యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది. దీని ద్వారా లాగిన్ అయి, టికెట్ను బుక్ చేసుకోవచ్చు.
Also Read: MLC Kavitha: మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
Related News
TTD: 2024 మే 16న తిరుపతిలో వార్షిక ఉత్సవాలు ప్రారంభం
TTD: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8.15 గంటల నుంచి 8.40 గంటల వరకు పవిత్ర మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, సంగీత వాయిద్యాల మధ్య గరుడ ధ్వజపథం ఎగురవేయడంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. పూర్వం శ్రీ గోవిందరాజస్వామి, గరుడ ధ్వజపథం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. ఉదయం ఉత్సవ దేవతలకు స్నపన �