Gold Price: మరోసారి భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఏపీ, తెలంగాణలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు భారీగా పెరిగాయి.
- By Gopichand Published Date - 07:18 AM, Sat - 16 December 23
Gold Pric: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు భారీగా పెరిగాయి. శనివారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,750గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,000గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.80,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (డిసెంబర్ 16, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Swiggy: ఒకే వ్యక్తి రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,150గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,300 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,600గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.63,000 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,000గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,000గా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,500 ఉండగా, ముంబైలో రూ.78,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,500 ఉండగా, కోల్కతాలో రూ.78,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, కేరళలో రూ.80,500గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,500 ఉండగా, విజయవాడలో రూ.80,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Cashback From Cred: రూ. 87,000 చెల్లింపుపై రూపాయి క్యాష్బ్యాక్.. ఆ యాప్పై సోషల్ మీడియాలో ట్రోల్స్
UPI, డిజిటల్ లావాదేవీల యాప్లు దేశంలోని ప్రజల చెల్లింపు పద్ధతుల్లో పెద్ద మార్పును తీసుకొచ్చాయి.