Gold Rates: ఈరోజు కూడా తగ్గిన పసిడి ధరలు.. నిన్నటితో పోలిస్తే నేటి రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.55,550గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,600గా నమోదైంది.
- By Gopichand Published Date - 07:15 AM, Sun - 28 May 23
Gold Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.55,550గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,600గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.77,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (మే 28, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Healthy Drink : వేసవిలో ఈ జావలు తయారుచేసుకొని తాగండి.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,750గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,940 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,040గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,600 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,000 ఉండగా, ముంబైలో రూ.73,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000 ఉండగా, కోల్కతాలో రూ.77,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.77,000 ఉండగా, కేరళలో రూ.77,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.77,000 ఉండగా, విజయవాడలో రూ.77,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
ICICI Bank: ఐసీఐసీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంక్ యాప్లో సాంకేతిక లోపం..!
ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ iMobile Payలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. కొంతమంది వినియోగదారులు ఈ ప్లాట్ఫారమ్లో ఇతరుల సున్నితమైన క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని చూడగలరని పేర్కొన్నారు.